Most ordered dish during IPL 2023 : ఐపీఎల్ 2023 టైమ్లో ఏ ఫుడ్కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయో తెలుసా?
30 May 2023, 11:53 IST
Most ordered dish during IPL 2023 : ఐపీఎల్ 2023 సమయంలో ప్రజలు ఏ డిష్ను ఎక్కువగా ఆర్డర్ ఇచ్చారో తెలుసా? స్విగ్గీ ప్రకారం.. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి.
ఐపీఎల్ 2023 టైమ్లో ఏ ఫుడ్కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయో తెలుసా?
Most ordered dish during IPL 2023 : సోమవారం జరిగిన నెయిల్ బైటింగ్ ఫైనల్ మ్యాచ్తో ఐపీఎల్ 2023కు తెరపడింది. గుజరాత్ టైటాన్స్ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్.. 5వ కప్ను తన ఖాతాలో వేసుకుంది. కోట్లాది మంది ధోనీ అభిమానులు.. ఆ క్షణాలను ఎంజాయ్ చేశారు. ఐపీఎల్ 2023 జర్నీ మొత్తం క్రికెట్ లవర్స్కు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. చెన్నై గెలవడం సరే.. మరి ఈ ఐపీఎల్ మొత్తంలో ఏ ఫుడ్కు ఎక్కువ ఆర్డర్లు లభించాయో తెలుసా?
నిమిషానికి 212 ఆర్డర్లు..!
ఐపీఎల్ 2023 షెడ్యూల్ మొత్తంలో ఎక్కువ ఆర్డర్లు వచ్చిన ఫుడ్గా నిలిచింది 'బిర్యానీ'. ఓవైపు తమ ఆటతో ప్లేయర్లు దుమ్మురేపుతుంటే.. మరోవైపు నిమిషానికి 212 ఆర్డర్లతో బిర్యానీ బౌండరీల మీద బౌండరీలు కొట్టేసింది! ఆర్డర్ల విషయంలో వార్ వన్ సైడ్ అయిపోయిందని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ చెప్పింది. అయితే.. ఇది వెజ్ బిర్యానీ ఆ? లేక నాన్వెజ్ బిర్యానీ ఆ? అన్న నెటిజన్ల ప్రశ్నకు ఇంకా స్విగ్గీ నుంచి సమాధానం లభించలేదు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. బిర్యానీని ఎక్కడ ఎక్కువగా ఆర్డర్ చేశారు? బిర్యానీ తర్వాత ఏ డిష్ ఎక్కువగా అమ్ముడుపోయింది ? వంటి ప్రశ్నలకు స్విగ్గీ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:- ONDC food delivery : జొమాటో, స్విగ్గీ కన్నా చాలా తక్కువ ధరకే ఫుడ్ డెలివరీ పొందండి ఇలా..
ఈ వార్త తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘బిర్యానీ ఈజ్ ఆన్ ఎమోషన్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
IPL 2023 Final : బిర్యానీకి ఇండియా మంచి క్రేజ్ ఉంది. అకేషన్ ఏదైనా.. బిర్యానీ ఉండాల్సిందే! 2023 న్యూ ఇయర్ ఈవ్ రాత్రి.. ఏకంగా 3.5లక్షల బిర్యానీలు అమ్ముడుపోయాయి. మరే ఇతర వంటకాలు కూడా బిర్యానీ దరిదాప్పుల్లో లేవు! స్విగ్గీ బృందం ప్రకారం.. ఆ రోజు రాత్రి 61వేల పిజ్జాలు అమ్ముడుపోయాయి.
న్యూ ఇయర్ ఈవ్ నాడు.. ఒక్క హైదరాబాద్ నుంచి 75.4శాతం బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ నిర్వహించిన ట్విట్టర్ పోల్లో తేలింది. ఆ తర్వాతి స్థానంలో లక్నో (14.2శాతం), కోల్కతా (10.4శాతం) ఉన్నాయి.
తొలిసారిగా లాభాలు..
ఇక స్విగ్గీ విషయానికొస్తే.. ఈ సంస్థ తొలిసారిగా మార్చ్లో లాభాలను నమోదు చేసింది. ఇది ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలో ఒక మైలురాయి అని భావించవచ్చు. ఫుడ్ డెలివరీ బిజినెస్కు పెరుగుతున్న ఆదరణకు ఇది చిహ్నం అని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
టాపిక్