Gold and silver prices today : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే
30 April 2024, 5:59 IST
- Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,540కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 66,550గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,65,400కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 6,654గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 72,590కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,600గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,25,900గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,259గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,690గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,740గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,540 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 72,590గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,390గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,520గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,540గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,590గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,540గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,590గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,590గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,640గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,540గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,640గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,390గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 దిగొచ్చి.. రూ. 83,900కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 84,000గా ఉండేది.
Silver price today : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 87,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 83,900.. బెంగళూరులో రూ. 83,400గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)