తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monkeypox Cases In India : ఢిల్లీలో నైజీరియన్​కు మంకీపాక్స్​.. దేశంలో 6వ కేసు

Monkeypox cases in India : ఢిల్లీలో నైజీరియన్​కు మంకీపాక్స్​.. దేశంలో 6వ కేసు

Sharath Chitturi HT Telugu

01 August 2022, 22:15 IST

  • Monkeypox cases in India : ఢిల్లీలో రెండో మంకీపాక్స్​ కేసు నమోదైంది. ఫలితంగా దేశంలో ఇప్పటివరకు 6 కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఢిల్లీలో నైజీరియన్​కు మంకీపాక్స్​
ఢిల్లీలో నైజీరియన్​కు మంకీపాక్స్​ (AFP)

ఢిల్లీలో నైజీరియన్​కు మంకీపాక్స్​

Monkeypox cases in India : దేశంలో మంకీపాక్స్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా.. ఢిల్లీలో ఓ 35ఏళ్ల వ్యక్తికి మంకిపాక్స్​ పాజిటివ్​గా తేలింది. ఆయన నైజీరియన్​ దేశస్థుడని సమాచారం. ఫలితంగా ఢిల్లీలో రెండో మంకీపాక్స్​ కేసు వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద దేశంలో ఇది 6వ మంకీపాక్స్​ కేసు.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

తాజాగా.. మంకీపాక్స్​ బారిన నైజీరియన్​.. ఇటీవలి కాలంలో ఎక్కడికీ ప్రయాణించకపోడంతో ఆయనకు అసలు ఆ వ్యాధి ఎలా సోకింది? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఢిల్లీలోని ఎల్​ఎన్​జేపీ ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. గత ఐదు రోజులుగా ఆయనకు జ్వరం ఉంది. శరీరంలో బొబ్బలు వచ్చాయి.

ఇటీవలే.. ఆయన రక్తనమూనాను పుణెలోని నేషనల్​ ఇన్​స్టిట్యూషన్​ ఆఫ్​ వైరాలజీకి తీసుకెళ్లారు. సోమవారం వచ్చిన ఫలితాల్లో ఆయనకు మంకీపాక్స్​ పాజిటివ్​ అని తేలింది.

మరోవైపు.. మంకీపాక్స్​ లక్షణాలతో ఇద్దరు ఆఫ్రికా దేశస్థులు ఇప్పటికే ఎల్​ఎన్​జేపీ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం.

తొలి మరణం..

Monkeypox death in India : దేశంలో శనివారం తొలి మంకీపాక్స్​ మరణం నమోదు కాగా.. సోమవారం దానిని అధికారులు గుర్తించారు. యూఏఈ నుంచి తిరిగొచ్చిన వ్యక్తి.. కేరళ త్రిస్సూర్​లో చికిత్స పొందుతూ శనివారం మరణించినట్టు.. ఆదివారం వార్తలు వచ్చాయి. కాగా.. ఆ వార్తలు నిజమేనని, ఆ వ్యక్తికి మంకీపాక్స్​ సోకిందని.. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్​ సోమవారం ధ్రువీకరించారు.

"జులై 22న.. ఓ యువకుడు యూఏఈ నుంచి కేరళకు తిరిగొచ్చాడు. 26న అతనికి జ్వరం వచ్చింది. ఆ సమయంలో కుటుంబసభ్యులతోనే ఉన్నాడు. 27న ఆసుపత్రిలో చేర్పించారు. 28న.. ఆ యువకుడిని వెంటిలేటర్​ మీద పెట్టారు. 30వ తేదీన ఆతను ప్రాణాలు కోల్పోయాడు. యూఏఈలో జులై 19న అతనికి మంకీపాక్స్​ పరీక్ష నిర్వహించారు. ఆ రిపోర్టుల్లో అతనికి పాజిటివ్​ వచ్చింది," అని వీనా జార్జ్​ వెల్లడించారు.

టాపిక్