తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cricket Ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Sharath Chitturi HT Telugu

06 May 2024, 17:20 IST

    • Pune news latest : మహారాష్ట్ర పుణెలో షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది. జననాంగాలకు క్రికెట్​ బాల్​ తగిలి.. ఓ 11ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు!
పుణెలో షాకింగ్​ ఘటన.. అక్కడ క్రికెట్​ బాల్​ తాకి, బాలుడు మృతి!
పుణెలో షాకింగ్​ ఘటన.. అక్కడ క్రికెట్​ బాల్​ తాకి, బాలుడు మృతి!

పుణెలో షాకింగ్​ ఘటన.. అక్కడ క్రికెట్​ బాల్​ తాకి, బాలుడు మృతి!

Boy Dies After Cricket Ball Hits His Genitals : మహారాష్ట్రలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 11ఏళ్ల బాలుడి జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకింది. అతను ప్రాణాలు కోల్పోయాడు!

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర పుణెలో గత వారం జరిగింది ఈ ఘటన. బాలుడి పేరు శంభు కాలిదాస్​ ఖండ్వే అలియాస్​ శౌర్య. వేసవి సెలవుల నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి అతను తరచూ క్రికెట్​ అడేవాడు. గత వారం కూడా స్నేహితులతో కలిసి క్రికెట్​ ఆడటానికి వెళ్లాడు. శౌర్య బౌలింగ్​ చేశాడు. బ్యాటర్​.. పవర్​ఫుల్​గా హిట్​ చేశాడు. ఆ క్రికెట్​ బాల్​.. శౌర్యవైపు దూసుకొచ్చింది. స్పందించే సమయం లేకపోవడంతో, ఆ బాల్​.. శౌర్య జననాంగాలను బలంగా తాకింది. అతను నొప్పితో విలపించి, నేల మీద పడిపోయాడు. ఆ దృశ్యాలు చూసిన మిగిలిన స్నేహితులు.. షాక్​కు గురయ్యారు. ఏం జరుగుతోందో వారికి అర్థం కాలేదు. శౌర్యవైపు పరుగులు తీశారు. శౌర్యను లేపేందుకు ప్రయత్నించారు. కానీ స్పృహ కోల్పోయిన శౌర్య.. స్పందించలేదు.

ఈ దృశ్యాలను.. అటుగా వెళుతున్న కొందరు చూశారు. వెంటనే.. అక్కడికి పరుగులు తీశారు. బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ 11ఏళ్ల శౌర్యని వైద్యులు కాపాడలేకపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన కొంతసేపటికే.. శౌర్య మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.

Maharastra news latest : ఘటనపై సమాచారం అందుకున్న శౌర్య కుటుంబసభ్యులు.. ఆసుపత్రికి పరుగులు తీశారు. తమ బిడ్డ మరణించాడన్న వార్త విని.. కుటుంబసభ్యులు చాలా బాధపడ్డారు.

ఇదీ చూడండి:- Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

మరోవైపు.. జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి, బాలుడు మరణించాడన్న వార్త పోలీసులకు తెలిసింది. ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. చివరికి.. యాక్సిడెంటల్​ డెత్త్​ (ప్రమాదవశాత్తు మరణం) కింద.. కేసు నమోదు చేసుకున్నారు.

క్రికెట్​ అనేది ఇండియాలో ఒక మతంతో సమానం. ప్రతి వీధిలో ఎవరో ఒకరు క్రికెట్​ ఆడుతూ కనిపిస్తారు. అలాంటిది.. జననాంగాలకు బాల్​ తగిలి బాలుడు మరణించాడన్న వార్త చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా.. పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆట కన్నా ప్రాణాలు ముఖ్యం అని అర్థం చేసుకోవాలి.

Pune Boy death : ఇంటర్నేషనల్​ మ్యాచ్​లో చాలా వసతులుంటాయి. ప్లేయర్లు గార్డ్స్​ పెట్టుకుని బ్యాటింగ్​ చేస్తారు. కానీ వీధుల్లో ఆడుకునే వారికి ఇవేవీ ఉండవు. అందుకే.. క్రికెట్​ ఆడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి!

తదుపరి వ్యాసం