Bihar CM assets : ఈ రాష్ట్రంలో.. సీఎం కన్నా కేబినెట్ మంత్రులే ధనవంతులు!
01 January 2023, 10:50 IST
Bihar CM Nitish Kumar assets : బీహార్లో సీఎం నితీశ్ కుమార్ కన్నా ఆయన కేబినెట్లో మంత్రులుగా పనిచేస్తున్న వారి ఆస్తుల విలువే ఎక్కువగా ఉంది. ఈ విషయం వారు ప్రకటించిన ఆస్తుల వివరాలను పరిశీలిస్తే తెలుస్తోంది.
బీహార్ సీఎం నితీశ్ కుమార్.
Bihar CM Nitish Kumar assets : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పాటు కేబినెట్ మంత్రులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. సీఎం కన్నా కేబినెట్ మంత్రుల వద్దే ఆస్తులు ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఆస్తుల వివరాలు..
సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రుల ఆస్తుల వివరాలను బిహార్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో డిసెంబర్ 31న అప్లోడ్ చేశారు. దీని ప్రకారం.. నితీశ్ కుమార్ వద్ద ఉన్న ఆస్తులు, స్థిరాస్తుల విలువ రూ. 75.53లక్షలు. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే ఇది రూ. 18వేలు ఎక్కువ. నితీశ్ కుమార్ వద్ద రూ. 28,135 నగదు క్యాష్ రూపంలోను, రూ. 51,856 నగదు డిపాజిట్ల రూపంలో వివిధ బ్యాంక్లలో ఉన్నాయి.
Bihar latest news : మొత్తం మీద బీహార్ సీఎం నితీశ్ కుమార్ వద్ద రూ. 16.68లక్షలు విలువ చేసే మూవెబుల్ అసెట్స్, రూ. 58.85లక్షలు విలువ చేసే ఇమ్మూవెబుల్ అసెట్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఢిల్లీ ద్వారకలోని కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీలో ఒక ఫ్లాట్ ఉంది.
సీఎంతో పాటు కేబినెట్ మంత్రుల ఆస్తులు, అప్పుల వివరాలను.. ప్రతి యేటా చివరి రోజున ప్రకటించాల్సిందిగా నితీశ్ కుమార్ గతంలో ఓ రూల్ తీసుకొచ్చారు. అందుకు కట్టుబడి.. ప్రతియేటా చివరి రోజున ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటిస్తూ వస్తున్నారు. సీఎం నితీశ్ కుమార్తో పాటు ఈసారి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయులు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్- పర్యావరణశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్లు కూడా తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు.
Bihar cabinet ministers assets : అధికారిక డేటా ప్రకారం.. సీఎం నితీశ్ కుమార్ కన్నా కేబినెట్ మంత్రులే ధనవంతులు! 2022 మార్చ్ నాటికి.. తేజస్వి యాదవ్ రూ. 75లక్షలు విలువ చేసే క్యాష్ ఉంది. ఆయన భార్య రాజ్శ్రీ వద్ద రూ. 1.25లక్షలు విలువ చేసే క్యాష్ ఉంది. ఇక తేజ్ ప్రతాప్ వద్ద రూ. 1.7లక్షల క్యాష్, రూ. 3.2కోట్లు విలువ చేసే ఆస్తులు, స్థిరాస్తులు ఉన్నాయి. తేజస్వీ యాదవ్ ఆస్తుల వివరాలు తెలియలేదు.
Tejaswi Yadav assets : తేజస్వీ, తేజ్ ప్రతాప్లతో పాటు ఆర్థికశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి, విద్యుత్శాఖ మంత్రి బిజేందర్ ప్రసాద్ యాదవ్, రెవెన్యూశాఖ మంత్రి అలోక్ కుమార్ మెహ్తా. పట్టణాభివృద్ధిశాఖ మంత్రి శ్రవణ్ కుమార్, భవన నిర్మాణాలశాఖ మంత్రి అశోక్ చౌదరి, గనులశాఖ మంత్రి సురేంద్ర ప్రసాద్ యాదవ్, సమాచారశాఖ మంత్రి సంజయ్ కుమార్ ఝా, రవాణాశాఖమంత్రి శీలా కుమార్లు తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు.