Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 90 పాయింట్లు జంప్
01 November 2022, 9:18 IST
- Stock market news : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఇండియా స్టాక్ మార్కెట్లు
Stock market news : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 354పాయింట్లు వృద్ధిచెంది 61,100 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 97పాయింట్ల లాభంతో 18,110 వద్ద ట్రేడ్ అవుతోంది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 786 పాయింట్లు పెరిగి 60,746 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ50.. 225 పాయింట్లు వృద్ధిచెంది 18,012 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 317 పాయింట్ల లాభంతో 41,307 మార్క్కు చేరింది. మిడ్ క్యాప్ సూచీ లాభలు చూడగా.. స్మాల్ క్యాప్ సూచీ మాత్రం నష్టాల్లో ముగిసింది. ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 61,066- 18,131 వద్ద మొదలుపెట్టాయి.
పివొట్ ఛార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్టు 17,931- 17,902 వద్ద ఉంది. 18,025-18,054 లెవల్స్ వద్ద రెసిస్టెన్స్ ఉంది.
"టెక్నికల్స్ పరంగా నిఫ్టీ అప్ట్రెండ్లోనే కనిపిస్తోంది. ఏదైనా రివర్సల్ కనిపించే వరకు.. ట్రేడర్లు ఈ అప్ట్రెండ్తో లబ్ధిపొందవచ్చు," అని 5పైసా.కామ్ లీడ్ రీసెర్చ్ రుచిత్ జైన్ వెల్లడించారు.
స్టాక్స్ టు బై..
- Stocks to buy : అశోక్ లేల్యాండ్:- బై రూ. 153, స్టాప్ లాస్ రూ. 148, టార్గెట్ రూ. 160
- రిలయన్స్ ఇండస్ట్రీస్:- బై రూ. 2550, స్టాప్ లాస్ రూ. 2500, టార్గెట్ రూ. 2625
స్టాక్స్ టు బై పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, పవర్గ్రిడ్, ఇన్ఫీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. రేపు ఫెడ్ సమావేశం నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత వ్యవహరిస్తున్నారు. డౌ జోన్స్ 0.39శాతం, ఎస్ అండ్ పీ 500 0.75శాతం, నాస్డాక్ 1.03శాతం పతనమయ్యాయి.
భారతీ ఎయిర్టెల్ క్యూ2 త్రైమాసిక ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆసియా మార్కెట్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.15శాతం, సౌత్ కొరియా కాస్పి 0.28శాతం మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
త్రైమాసిక ఫలితాలు..
Q2 results 2022 : సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్ర, యూపీఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, నైకా, కర్ణాటక బ్యాంక్, ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్, వోల్టాస్, వరుణ్ బేవరేజెస్, వర్పూల్, చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, జేకే టైర్స్, కాన్సాయ్ నెరొలాక్ పెయింట్స్తో పాటు ఇతర సంస్థ త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
టాటా స్టీల్ క్యూ2 త్రైమాసిక ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,178.61కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు.. రూ .1,107.10కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.