Bharti Airtel Q2 results: క్యూ2లో 89శాతం పెరిగిన ఎయిర్టెల్ లాభాలు!
Bharti Airtel Q2 results: భారతీ ఎయిర్టెల్ కాన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 89శాతం వృద్ధిచెందింది. ఈ మేరకు క్యూ2 ఫలితాలను సంస్థ సోమవారం ప్రకటించింది.
Bharti Airtel Q2 results : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్.. ఈ ఆర్థిక ఏడాది క్యూ2 ఫలితాలను సోమవారం వెల్లడించింది. సంస్థ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 89శాతం వృద్ధి చెంది.. రూ. 2,145కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో దీని విలువ రూ. 1,134కోట్లుగా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
ఆపరేషన్స్ నుంచి ఎయిర్టెల్ సాధించిన ఆదాయం 21.9శాతం పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 28,326కోట్లుగా ఉండగా.. ఈసారి రూ. 34,527గా నమోదైంది.
ఇయర్ ఆన్ ఇయర్లో ఎయిర్టెల్ నెట్ ప్రాఫిట్ 75-110శాతం మధ్యలో వృద్ధిచెందుతుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఆదాయం 20శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు.
Airtel q2 results 2022 : ఇక ఎయిర్టెల్ ఆర్పూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) రూ. 190కి పెరిగింది. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్పూ వాల్యూ రూ. 183గా ఉండేది. టెలికాం సంస్థలకు ఆర్పూ చాలా కీలకం. ఈ విషయంలో ఎప్పటికప్పుడు వృద్ధి సాధిస్తుండటం.. ఎయిర్టెల్కు సానుకూలం అని విశ్లేషకులు అంటున్నారు.
ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ ఎబిట్.. 6.7శాతం వృద్ధిచెంది రూ. 17,721కోట్లకు చేరింది. గత త్రైమాసికంతో పోల్చుకుంటే.. ఆపరేటింగ్ మార్జిన్ 50.6శాతం నుంచి 51.3శాతానికి పెరిగింది.
"మరో త్రైమాసికంలో మా ఆదాయాన్ని పెంచుకున్నాము. మార్జిన్లను మెరుగుపరుచుకున్నాము. గత త్రైమాసికంతో పోల్చుకుంటే.. ఈసారి కన్సాలిడేటెడ్ రెవెన్యూ 5.3శాతం పెరిగంది. ఎబిట్డా మార్జిన్ 51.3శాతానికి చేరింది. మా పోర్ట్ఫోలియో శక్తివంతంగా ఉండటంతోనే ఇలాంటి ఫలితాలను డెలివరీ చేస్తున్నాము," అని ఎయిర్టెల్ ఇండియా, సౌతేషియా సీఈఓ గోపాల్ విట్టల్ తెలిపారు.
Airtel share price : సోమవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్లో ఎయిర్టెల్ షేర్ ప్రైజ్ రూ. 832 వద్ద స్థిరపడింది. సోమవారం ఈ స్టాక్ 1.85శాతం పెరిగింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్స్లో ఎయిర్ షేరు ధర 3.26శాతం మేర వృద్ధి చెందింది. ఇక ఈ ఏడాదిలో ఎయిర్టెల్ షేరు విలువ ఇప్పటివరకు 20.35శాతం పెరిగింది.
ఎయిర్టెల్ 5జీ..
టెలికాం కంపెనీల మధ్య ఇప్పుడు 5జీ వార్ మొదలైంది. ఇందుకు ఎయిర్టెల్ పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే.. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్, వారణాసి ప్రాంతాల్లో 5జీని లాంచ్ చేసింది. 4జీ ప్లాన్లకు తగ్గట్టుగానే 5జీ సేవలను పొందవచ్చు అని ఎయిర్టెల్ చెప్పింది. ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలు.. ప్రస్తుతానికి యాపిల్, శాంసంగ్, షావోమీ, వివో, ఒప్పో, రియల్మీ, వన్ప్లెస్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి.
సంబంధిత కథనం