తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 30 December 2022 Check Latest Price In Telugu States

Gold and silver rates today : తగ్గిన పసిడి, వెండి ధరలు.. ప్లాటీనం కూడా!

30 December 2022, 6:01 IST

    • Gold and silver rates today : దేశంలో బంగారం, వెండి, ప్లాటీనం ధరలు తగ్గాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (PTI)

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 50,050కి చేరింది. గురువారం ఈ ధర రూ. 50,150గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 తగ్గి, రూ. 5,00,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,005గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 తగ్గి.. రూ. 54,600కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 54,710గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1100 దిగొచ్చి.. రూ. 5,46,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,460గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,200గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,750గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,050 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 54,600గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 50,950గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 55,580గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 50,050గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 54,600గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 50,050గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 54,600గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 50,100గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 54,650గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 50,050గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 54,600గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,030గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 2000 పడి.. రూ. 70,300కి చేరింది. గురువారం ఈ ధర రూ. 72,300గా ఉండేది.

Silver rates today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 70,300.. బెంగళూరులో రూ. 74,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 150 దిగొచ్చి.. రూ 26,910కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,060గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,910గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)