తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rate Today: స్థిరంగా పసిడి.. భారీగా పెరిగిన వెండి.. నేటి ధరలు ఇవే

Gold Rate Today: స్థిరంగా పసిడి.. భారీగా పెరిగిన వెండి.. నేటి ధరలు ఇవే

28 December 2022, 6:12 IST

    • Gold, Silver Prices: దేశంలో నేడు పసిడి ధరలు స్థిరంగా కొనసాగాయి. మరోవైపు వెండి మాత్రం భారీగా జంప్ చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
 Gold Price Today: నేటి బంగారం, వెండి ధరలు
Gold Price Today: నేటి బంగారం, వెండి ధరలు

Gold Price Today: నేటి బంగారం, వెండి ధరలు

Gold - Silver price Today: పైకి పరుగులు పెడుతూనే ఉన్న బంగారం ధర నేడు (డిసెంబర్ 28, బుధవారం) కాస్త ఎడతెరిపిని ఇచ్చింది. దేశీయ మార్కెట్‍లో పసిడి ధర నేడు స్థిరంగా కొనసాగింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి రూ.49,950గా ఉంది. కిందటి రోజు ధరే కొనసాగింది. రూ.50వేలకు అత్యంత చేరువలో ఉంది. గ్రాము ధర రూ.4,950 వద్ద కొనసాగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్తబ్దుగానే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.54,480గా ఉంది.100 గ్రాముల రేటు రూ.5,44,800 వద్ద కొనసాగింది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‍లో..

Gold Rate Today: హైదరాబాద్ మార్కెట్‍లోనూ నేడు పసిడి ధరలు స్థిరంగా కొనసాగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.49,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,480గా ఉంది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, కడపలోనూ ఇవే ధరలు కొనసాగాయి.

ఇతర ప్రధాన నగరాల్లో..

Gold Rate Today: దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.50వేల మార్కుపైనే ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.50,100 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల వెల రూ.54,630గా ఉంది. జైపూర్, ఘజియాబాద్‍లోనూ ఇవే ధరలు ఉన్నాయి. ముంబై, కోల్‍కతా, భువనేశ్వర్ నగరాల్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.49,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.54,480 వద్ద కొనసాగింది.

బెంగళూరు, అహ్మదాబాద్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.50,000గా ఉంది. 24 గ్రాముల 10 గ్రాముల వెల రూ.54,510గా నమోదైంది. చెన్నైలో సిటీలో 22 గ్రాముల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.50,900గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,520గా ఉంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‍లో పసిడి మళ్లీ పరుగులు తీస్తూనే ఉంది. స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,810 డాలర్ల ఎగువకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ డిమాండ్ పెరుగుతుండటంతో పసిడి ధర అధికమవుతోంది. ఇక ద్రవ్యోల్బణం కూడా పసిడి ధరపై ప్రభావం చూపిస్తోంది.

వెండి పరుగులు

Silver Rate Today: దేశీయ బులియన్ మార్కెట్‍లో నేడు బంగారం స్థిరంగా ఉంటే.. వెండి మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,200 పెరిగి.. రూ.72,300కు చేరింది. ఒక్క రోజులోనే ధర బిగ్ జంప్ చేసింది.

హైదరాబాద్‍తో పాటు విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు సహా మిగిలిన నగరాల్లోనూ వెండి ధర అధికమైంది. కిలో వెండి వెల రూ.74,200కు చేరింది. ఢిల్లీ, ముంబై, కోల్‍కతా, అహ్మదాబాద్‍లో కిలో వెండి ధర రూ.72,300కు ఎగబాకింది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం