CM Jagan in Assembly : పోలవరం అంటే వైఎస్ఆర్.. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేది నేనే - సీఎం జగన్
23 March 2023, 17:18 IST
ap assembly budget sessions: పోలవరం అంటే వైఎస్ఆర్ అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం జగన్. గురువారం అసెంబ్లీ మాట్లాడిన ఆయన… పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేది తానేనంటూ స్పష్టం చేశారు.
ఏపీ సీఎం జగన్
CM Jagan Speech in Assembly: పోలవరం అంటే వైయస్ఆర్ అని... వైయస్ఆర్ అంటే పోలవరమన్నారు సీఎం జగన్. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన... పోలవరం ప్రాజెక్ట్ ను ప్రారంభించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని... పూర్తి చేసేది ఆయన కొడుకే(జగన్మోహన్ రెడ్డి) అంటూ కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎల్లో మీడియా అభూత కల్పనలతో కథనాలను ప్రసారం చేస్తోదంని విమర్శించారు. ఎల్లో మీడియా, దత్త పుత్రుడిని అడ్డం పెట్టుకుని ఒక అబద్ధాన్ని చెప్పిందే వందసార్లు చెప్పి నిజమని ప్రచారం చేయటంలో చంద్రబాబు దిట్ట అంటూ దుయ్యబట్టారు. గోబెల్స్ ప్రచారం చేయటంలో గొప్ప వ్యక్తి కూడా చంద్రబాబే అని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు ముఖ్యమంత్రి జగన్. అసలు పోలవరం అనే పేరు పలికే అర్హత ఆయనకు లేదన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం పోలవరంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీని తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు ముఖ్యమంత్రి జగన్. పోలవరంపై ఎల్లో మీడియా వేస్తున్న కథనాలు అన్నీ కూడా అసత్య కథనాలన్నీ స్పష్టం చేశారు.
"చంద్రబాబు రాజకీయాలు చేసేది ఎల్లో మీడియా కోసం మాత్రమే. వీరికి తోడు దత్తపుత్రుడు ఉన్నాడు. వీరి ఆధారంగానే చంద్రబాబు రాజకీయం చేస్తాడు.2004లో సీఎం అయ్యాక..తన డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ను రాజశేఖర్ రెడ్డి చేపట్టే వరకు వీరంతా కనీసం ఆలోచన చేశారా...? 2004కు ముందు చంద్రబాబు సీఎంగా పని చేశారు. 9 ఏళ్ల కాలంలో ఆయనేం చేశారు. కనీసం ఒక్కరోజైనా పోలవరం అనే పదం వినబడిందా..? 2014 వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ పేరును చంద్రబాబు పలకలేదు. 1995 నుంచి 2014 దాకా కనీసం పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు మాట్లాడలేదు. వీటిపై ఎల్లో మీడియా ఏం చేసింది...? పోలవరం ప్రాజెక్ట్ ను చంద్రబాబే కట్టారంటూ కథనాలు వేస్తున్నారు. ఇవన్నీ అసత్యాలు. పోలవరం అంటే వైఎస్ఆర్... వైఎస్ఆర్ అంటే పోలవరం. ప్రారంభించింది నాన్నే... పూర్తి చేసేది ఆయన కొడుకే" అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ అంటే చంద్రబాబు ఏటీఎం వంటిందన్నారు సీఎం జగన్. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి మోదీ కూడా చెప్పారని గుర్తు చేశారు. కేవలం చంద్రబాబుకే ఏటీఎం కాదని... ఆయనవెంట ఉండే ముఠా అంతటికీ ఏటీఎం వంటిదే అన్నారు. రామోజీరావ్, పుట్టా సుధాకార్, యనమల రామకృష్ణుడు వంటి వారు దోచుకున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు అనేక మంది యథేచ్చగా ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్.