తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Araku Tour Package : రూ. 6999కే అరకు ట్రిప్ - తెలంగాణ టూరిజం ప్యాకేజీ వివరాలివే

Araku Tour Package : రూ. 6999కే అరకు ట్రిప్ - తెలంగాణ టూరిజం ప్యాకేజీ వివరాలివే

28 April 2024, 13:19 IST

    • Hyderabad to Araku Tour : హైదరాబాద్ నుంచి అరకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం.  తక్కువ ధరలోనే 4 రోజుల పాటు అరకు అందాలను వీక్షించేయవచ్చు. రోడ్డు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….
అరకు టూర్ ప్యాకేజీ
అరకు టూర్ ప్యాకేజీ (photo source from https://unsplash.com/)

అరకు టూర్ ప్యాకేజీ

Telangana Tourism Hyderabad Araku Tour : అతి తక్కువ ధరలోనే అరకును చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం(Telangana Tourism). రోడ్డు మార్గం ద్వారా…ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ - అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలివే

AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ - ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ అనుమతి..!

IRCTC Tirupati Tour Package : తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం-విశాఖ నుంచి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ!

తెలంగాణ టూరిజం అరకు టూర్ షెడ్యూల్

  • అరకుకు టూరిజం ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం(Telangana Tourism) . Araku Tour - Telangana Tourism పేరుతో  ఆపరేట్ చేస్తుంది.
  • ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 4 రోజులు ఉంటుంది. 
  • చూసే ప్రాంతాలు : అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి,
  • బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • రెండో రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సింహాచలం, కైలాసగిరి, Rushikondaను చూస్తారు. అంతేకాకుండా…. సబ్ మైరైన్ మ్యూజియంను సందర్శిస్తారు.సాయంత్రం వైజాగ్ బీచ్ ను చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు. 
  •  ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు. ఈ జర్నీ చాలా బాగుంటుంది. అరకులో ఉంటే ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, Borracaves, Dhisma Danceను చూస్తారు. రాత్రి అరకులోనే ఉంటారు.
  • నాల్గో రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
  • నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.
  • టికెట్ ధరలు చూస్తే… పెద్దవారికి రూ.  రూ. 6,999గా  ఉంది. పిల్లలకు 5.599గా నిర్ణయించారు.

6 రోజుల థాయ్లాండ్ ట్రిప్

IRCTC Vizag Thailand Tour Package 2024: వైజాగ్ నుంచి డైరెక్ట్ గా థాయ్ లాండ్ వెళ్లాలని అనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. IRCTC టూరిజం. ఇప్పటికే అనేక ప్యాకేజీలను తీసుకొచ్చిన ఐఆర్ సీటీసీ… అతి తక్కువ ధరలోనే వాటిని ఆపరేట్ చేస్తోంది. ఇందులో ట్రైన్ తో పాటు ఫ్లైట్ టూర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. అయితే థాయ్ లాండ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు ఫ్లైట్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్యాకేజీ మాత్రం.. ప్రస్తుతం అందుబాటులో లేదు. సెప్టెంబర్ 7, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఇందుకు సంంబధించిన వివరాలను ఇక్కడ చూద్దాం….

వైజాగ్ టూ థాయ్లాండ్ ప్యాకేజీ వివరాలు:

  • వైజాగ్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం.
  • MAGICAL THAILAND EX VISHAKHAPATNAM పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
  • 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. వైజాగ్ నుంచి అందుబాటులో ఉంటుంది.
  • సెప్టెంబర్ 7, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీని ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు.
  • ఫస్ట్ డే వచ్చేసి… విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. ముందుగా బ్యాకాంక్ కు(Flight No. FD-117) చేరుకుంచారు.
  • రెండో రోజు వచ్చేసి…. పట్టాయాకు వెళ్తారు. లంచ్ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత Nong Nooch Garden Tour ఉంటుంది. రాత్రి పట్టాయాలోనే ఉంటారు.
  • మూడో రోజు టిఫిన్ చేసిన తర్వాత,,, Coral Island Tourకు వెళ్తారు. స్పీడ్ బోట్ ద్వారా చేరుకుంటారు. ఆ తర్వాత పట్టాయాకు వస్తారు.
  • నాల్గోవ రోజు సఫారీకి వెళ్తారు. ఆ తర్వాత బ్యాకాంక్ కు చేరుకుంటారు. పలు ప్రాంతాలను సందర్శిస్తారు.
  • ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. Half day City Tour ఉంటుంది. ఇందులో భాగంగా గోల్డెన్ బుద్దాను చూస్తారు. ఇండియన్ రెస్టారెంట్ లో లంచ్ ఉంటుంది. ఆ తర్వాత Shri Racha Tiger Zooకి వెళ్తారు.
  • ఆరో రోజు ఉదయం Grand Palaceను సందర్శిస్తారు. లంచ్ తర్వాత సాయంత్రం 6 గంటలకు బ్యాకాంక్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 10.20 గంటలకు విశాఖకు చేరుకుంటారు.
  • టికెట్ ధరలు చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 66735, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 57815గా ఉంది. ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 57815గా నిర్ణయించారు.
  • ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
  • https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
  • 8287932318, 9281495847, 8287932227 సందేహాల నివృత్థి కోసం ఈ నెంబర్లను సంప్రదించవచ్చు.

తదుపరి వ్యాసం