తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Kills Live In Partner : పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలిని.. 35 ముక్కలుగా నరికి...!

Man kills live in partner : పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలిని.. 35 ముక్కలుగా నరికి...!

14 November 2022, 11:53 IST

    • Man kills live in partner in Delhi : పెళ్లి చేసుకోవాలని గొడవ చేస్తున్న ప్రియురాలని.. అత్యంత కిరాతకంగా చంపాడు ఓ వ్యక్తి. మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి.. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.
పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలిని.. 35 ముక్కలుగా నరికిన ప్రియుడు!
పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలిని.. 35 ముక్కలుగా నరికిన ప్రియుడు!

పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలిని.. 35 ముక్కలుగా నరికిన ప్రియుడు!

Man kills live in partner in Delhi: ఢిల్లీలో అత్యంత దారుణ, అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి.. తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని హత్య చేశాడు. పెళ్లి చేసుకోవాలని అడుగుతుండటంతో.. ఆమెను చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. ఈ ఏడాది మేలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

పెళ్లి చేసుకోవాలని గొడవ చేస్తే..

26ఏళ్ల శ్రద్ధ.. ముంబైలోని ఓ ఎంఎన్​సీలో పని చేసేది. అక్కడే ఆమెకు అఫ్తబ్​ అమీన్​ పూనావాలా అనే వ్యక్తితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కానీ వారి ప్రేమకు ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. చివరికి.. వారిద్దరు ముంబైని విడిచి ఢిల్లీకి వెళ్లారు.

ఈ ఏడాది తొలినాళ్లల్లో.. ఢిల్లీలోని మెహ్రౌలిలో ఓ ఫ్లాట్​ తీసుకుని ఇద్దరు కలిసి సహజీవనం మొదలుపెట్టారు. ఇలా రోజులు గడిచాయి.

man kills lover in Delhi : శ్రద్ధ కుటుంబసభ్యులు.. కొన్ని వారాల పాటు ఆమెకు ఫోన్​ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ఫోన్​ స్విచ్ఛాఫ్​ అని వచ్చింది. కంగారు పడిన తండ్రి.. ఈ నెల 8న ఢిల్లీకి వెళ్లాడు. ఫ్లాట్​కు వెళ్లేసరికి.. లాక్​ వేసి ఉండటాన్ని గమనించాడు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనను కిడ్నాప్​ కేసుగా నమోదు చేసుకున్న మెహ్రౌలి పోలీస్​ స్టేషన్​ అధికారులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ క్రమంలోనే శనివారం.. పూనావాలాను అరెస్ట్​ చేశారు పోలీసులు. విచారణలో భాగంగా.. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు పూనావాలా. అతనే.. శ్రద్ధను చంపినట్టు అంగీకరించాడు.

"ఢిల్లీకి వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. పెళ్లి చేసుకోవాలంటూ శ్రద్ధ నిత్యం గొడవ చేసేది. తట్టుకోలేకపోయాను. అందుకే ఆమెను చంపేశాను," అని పోలీసులకు నిందితుడు వివరించాడు.

Delhi crime news : కాగా.. ఈ కేసులో కొన్ని షాకింగ్​ ఘటనకు వెలుగులోకి వచ్చాయి. మే 18న.. శ్రద్ధ- పూనావాలా మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ వెంటనే.. శ్రద్ధను తన ఫ్లాట్​లో హత్య చేశాడు నిందితుడు. ఆ తర్వాత.. మృతదేహాన్ని దాచిపెట్టేందుకు ఓ ఫ్రిడ్జ్​ను కొన్నాడు. శ్రద్ధ శరీరాన్ని 35 ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జ్​లో పెట్టాడు.

ఆ తర్వాత.. మరో 18 రోజుల వరకు మృతదేహంలోని ఒక్కో భాగాన్ని బ్యాగ్​లో వేసుకుని అర్ధరాత్రి 2 గంటలకు బయటకు వెళ్లేవాడు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో, ఎవరికి అనుమానం రాకుండా ఉండే విధంగా పడేసేవాడు!

Man kills live in partner in Delhi : ఈ ఘటనతో శ్రద్ధ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్​ చేస్తున్నారు.