తెలుగు న్యూస్  /  Telangana  /  Younger Brother Killed By Own Brother Due To Extra Marital Affair

Extra Marital Affair : తమ్ముడిని నరికి చంపిన అన్న….

HT Telugu Desk HT Telugu

25 October 2022, 6:58 IST

    • Extra Marital Affair వివాహేతర సంబంధం నేపథ్యంలో తమ్ముడిని నరికి చంపిన ఉదంతం ఖమ్మం జిల్లా వైరాలో జరిగింది. 
వైరాలో అన్న చేతిలో తమ్ముడి హత్య
వైరాలో అన్న చేతిలో తమ్ముడి హత్య

వైరాలో అన్న చేతిలో తమ్ముడి హత్య

Extra Marital Affair అన్న భార్యతో అనైతిక సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. వదినతో వివాహేతర సంబంధం నడుపుతున్న తమ్ముడిని అన్న పండుగ రోజే గొడ్డలితో నరికి చంపాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో తోడబుట్టిన అన్న ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. తమ్ముడిని నరికి చంపిన తర్వాత అక్రమ సంబంధం వల్లే హత్య చేశానని పోలీసుల విచారణలో తేల్చి చెప్పాడు. వైరా మండలం రెబ్బవరం గ్రామంలో దీపావళి పండగ రోజు చోటు చేసుకుంది. రెబ్బవరం గ్రామంకు చెందిన సర్పంచ్ సాదం రామారావు, సాదం రామకృష్ణ, సాదం నరేష్ అన్నదమ్ములు. రామకృష్ణ, నరేష్ లు తన తల్లి సుబ్బమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

రామకృష్ణ, నరేష్ లకు వివాహమైంది. ముగ్గురు సోదరుల్లో చివరి వాడైన నరేష్ భార్య రెండేళ్ల క్రితం అతడిని వదిలి వెళ్ళింది. ప్రస్తుతం ఇంట్లో నరేష్‌తో పాటు రామకృష్ణ దంపతులువారి తల్లి సుబ్బమ్మ ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం తన భార్యతో నరేష్ సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన రామకృష్ణ, తమ్ముడు నరేష్ ను హత్య చేయాలని పథకం రచించాడు.

దీపావళి పండుగ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రామకృష్ణ భార్య తన పుట్టిల్లు అయిన రాజమండ్రికి వెళ్ళింది. వారి తల్లి సుబ్బమ్మ పండుగకు కూతురు ఇంటికి వెళ్ళింది. ఆదివారం రాత్రి నరేష్, రామకృష్ణ లు ఇద్దరు కలిసి గ్రామంలోనే మద్యం సేవించారు. సోమవారం తెల్లవారుజామున రామకృష్ణ నిద్రలో ఉన్న నరేష్ పై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. మెడ భాగంపై దాడి చేయడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

హత్య చేసిన తర్వాత నిందితుడు అక్కడే ఉండిపోయాడు. స్థానికుల సమాచారంతో వైరా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవటం వల్లనే తన తమ్ముడు నరేష్ ను చంపినట్లు రామకృష్ణ అంగీకరించాడుర. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టాపిక్