India China border : చైనాతో సరిహద్దు వివాదంపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు!
15 January 2023, 9:16 IST
- Jaishankar on India China border dispute : భారత్ చైనా సరిహద్దు వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు జైశంకర్. ఉత్తర సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు.
చైనాతో సరిహద్దు వివాదం.. జైశంకర్ సంచలన వ్యాఖ్యలు!
Jaishankar on India China border dispute : భారత దేశ ఉత్తర సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్. భారత్తో కుదుర్చున్న ఒప్పందానికి వ్యతిరేకంగా.. సరిహద్దుల్లో భారీ స్థాయిలో దళాలను చైనా మోహరిస్తోందని వ్యాఖ్యానించారు.
‘ఒప్పందాన్ని లెక్కచేయని చైనా!’
తమిళనాడు చెన్నైలో శనివారం జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్నారు జైశంకర్. ఈ క్రమంలోనే చైనా, సరిహద్దు వివాదం వంటి అంశాలపై మాట్లాడారు.
India China border dispute : "ఉత్తర సరిహద్దుల్లో భారీ స్థాయిలో దళాలను చైనా మోహరిస్తోంది. ఫలితంగా సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇది భారత్తో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధం. కొవిడ్ సంక్షోభంలోనూ.. 2020 మేలో ఇదే జరిగింది. కానీ చైనా చర్యలను భారత్ సమర్థవంతంగా, శక్తివంతంగా తిప్పికొడుతోంది," అని జైశంకర్ స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో భారత్ మోహరించిన దళాలు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నాయని, ఎంతటి ప్రతికూల వాతావరణాన్నైనా ఎదుర్కొంటూ విధి నిర్వహణలో పాల్గొంటున్నాయని తెలిపారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్.
India China relations : "జాతీయ భద్రత విషయంలో భారత్ తలొగ్గదని.. చైనాతో జరిగిన పరిణామాలను చూసి ప్రపంచ దేశాలు అర్థం చేసుకున్నాయి. అందుకే ప్రపంచ వేదికపై భారత్కు గౌరవం, గుర్తింపు లభిస్తోంది," అని జైశంకర్ అన్నారు.
సరిహద్దు వివాదం నేపథ్యంలో.. చైనాపై జైశంకర్ ఈ తరహా సంచలన వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా కుట్ర పన్నుతోందని.. గతంలోనూ కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు విదేశాంగశాఖ మంత్రి.
India China border clash : "ఏకపక్ష ధోరణితో ఎల్ఏసీని మార్చకూడదని చైనా- భారత్ మధ్య ఒప్పందం ఉంది. కానీ సరిహద్దుల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి," అని ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియన్ జేఐబీ2 పాడ్క్యాస్ట్లో తెలిపారు జైశంకర్.
సరిహద్దుల్లో అలజడులు..
భారత్- చైనాల మధ్య 2020 నుంచి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా 2020 జూన్లో జరిగిన గల్వాన్ ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. అప్పటి నుంచి.. ఇరు దేశాల ఉన్నతాధికారులు.. సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు. శాంతి కొనసాగుతున్నప్పటికీ.. పూర్తిస్థాయి పరిష్కారమైతే లభించలేదు. ఈ క్రమంలోనే గత నెలలో అరుణాచల్ప్రదేశ్లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తినట్టు వచ్చిన వార్తలం సంచలనంగా మారాయి. సరిహద్దును దాటి వచ్చిన చైనా సైనికులను భారత దళం సమర్థవంతంగా తిప్పికొట్టిందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.