Venkaiah Naidu : రాజ్యసభ ఛైర్మన్గా వెంకయ్య నాయుడికి ఫుల్ మార్క్లు పడ్డాయా?
06 August 2022, 11:57 IST
- Venkaiah Naidu : రాజ్యసభ ఛైర్మన్గా వెంకయ్య నాయుడికి ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలు. పెద్దల సభ ఛైర్మన్గా ఆయన ఉత్పాదకత తొలుత చాలా తక్కువగా ఉండేది. అనంతరం పుంజుకుంది.
రాజ్యసభ ఛైర్మన్గా వెంకయ్య నాయుడికి ఫుల్ మార్క్లు పడ్డాయా?
Venkaiah Naidu : ఈ నెల 10తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుంది. వెంకయ్య నాయుడు పదవీకాలంలో ఎన్నో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఎంపీల సస్పెన్షన్ వంటి కఠిన నిర్ణయాలు సైతం వెంకయ్య తీసుకున్నారు. కాగా.. రాజ్యసభ ఛైర్మన్గా వెంకయ్య నాయుడి ఉత్పాదకత తొలుత చాలా తక్కువగా ఉన్నా.. అనంతరం భారీగా పుంజుకుంది.
2022 బడ్జెట్ సెషన్ వరకు.. వెంకయ్య నాయుడు హయాంలో 13 పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా సాగాయి. మొదటి కొన్ని సెషన్స్లో రాజ్యసభ ఛైర్మన్గా ఆయన ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. ఐదు సెషన్లలో ఉత్పాదకత 6.8శాతం- 58.80శాతంగా నమోదైంది. కానీ ఆ తర్వాతి 8 సెషన్లు.. రాజ్యసభ కార్యకలాపాలు జోరుగా సాగించారు వెంకయ్య నాయుడు. 6 సెషన్లలోనే ఆయన ఉత్పాదకత 76శాతం- 105శాతం మధ్యలో నిలిచింది. ఐదు సెషన్స్లో.. 100శాతం సమయాన్ని వినియోగించుకుని రాజ్యసభ పని చేయడం విశేషం.
13సెషన్లలో.. అనేక మార్లు రాజ్యసభ వాయిదా పడింది. ఇందుకు 58 ప్రధాన కారణాలున్నాయి. ఆయా సందర్భాల్లో సమస్య పరిష్కారానికి వెంకయ్య నాయుడు కృషి చేశారు.
"సమావేశాల్లోని 57శాతం రోజులు పాక్షికంగా- లేదా పూర్తిగా వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం 36సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఒక్క 2018 బడ్జెట్ సమావేశాల్లోనే ఆ అంశాన్ని 24సార్లు ప్రస్తావించారు," అని ఒక అధికారిక ప్రకటన వెలువడింది.
రైతు చట్టాలు- నిరసనలు, పెగాసెస్ స్పైవేర్, కావేరీ బోర్డు ఏర్పాటు వంటి అంశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2021 శీతాకాల సమావేశాల్లో 12మంది ఎంపీల సస్పెన్షన్ సైతం సభ కార్యకలాపాలను ప్రభావితం చేసింది.
Parliament monsoon session : రాజ్యసభ ఛైర్మన్గా వెంకయ్య నాయుడు పదవీకాలంలో.. 78శాతం ఎంపీలు ప్రతిరోజు పెద్దలసభకు హాజరయ్యారు. 3శాతం మంది హాజరుకాలేదు. వివిధ సెషన్స్లో.. 30శాతం మంది ఎంపీలకు ఫుల్ అటెండెన్స్ ఉండటం విశేషం.
1978 నుంచి రాజ్యసభ కార్యకలాపాలకు సంబంధించి డేటాను తయారు చేయడం అనవాయతీగా వస్తోంది. అన్ని సెషన్లలోనూ కశ్ఛన్ హవర్కు క్రమంగా సమయం తగ్గిపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది!