UP crime news : ప్రియుడితో కలిసి భర్తను 'పాతేసిన' భార్య.. నాలుగేళ్ల తర్వాత!
15 November 2022, 7:00 IST
- Woman kills husband with lover : ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. అంతేకాకుండా.. ప్రియుడి ఇంట్లో గొయ్యి తవ్వి, భర్త మృతదేహాన్ని అందులో పాతేసింది. నాలుగేళ్ల తర్వాత.. మృతదేహం పోలీసులకు లభించింది. ఉత్తర్ప్రదేశ్లో జరిగింది ఈ ఘటన.
ప్రియుడితో కలిసి భర్తను 'పాతేసిన' భార్య.. నాలుగేళ్ల తర్వాత!
Woman kills husband with lover : ఉత్తర్ప్రదేశ్ ఘజియాబాద్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ.. ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. మరణించిన వ్యక్తి మృతదేహం.. నాలుగేళ్ల తర్వాత పోలీసులకు దొరికింది!
ఏం జరిగింది..?
2018 నాటి ఘటన ఇది. సవిత అనే మహిళకు చంద్రవీర్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. తన కుటుంబంతో కలిసి ఘజియాబాద్లో నివాసముంటోంది. అదే సమయంలో పక్కింట్లో ఉండే అరుణ్తో ఆమె అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. భర్తను వదిలించుకోవాలని భావించింది సవిత. ఈ క్రమంలోనే అరుణ్ కలిసి.. భర్తను చంపేందుకు ప్రణాళికలు రచించింది. వారిద్దరు సమయం కోసం ఎదురుచూశారు.
ఈలోగా.. అరుణ్.. తన ఇంట్లో ఓ 6,7 అడుగుల గొయ్యి తవ్వాడు. సమయం చూసుకుని ఇద్దరు.. చంద్రవీర్ను హత్య చేశారు. ఆ తర్వాత.. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా, ఎవరికీ అనుమానం రాకుండా తవ్విన గొయ్యిలో పడేశారు. ఆ వెంటనే.. సిమెంట్ ఫ్లోరింగ్తో గొయ్యిని కప్పేశారు. అప్పటి నుంచి అరుణ్ అదే చోట నివాసముంటున్నాడు!
Uttar Pradesh crime news : మరోవైపు.. ఈ వ్యవహారంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు మరో ప్రణాళిక రచించింది సవిత. తన భర్త కనిపించడం లేదని కిడ్నాప్ కేసు వేసింది. మరిదిపై అనుమానాలు ఉన్నట్టు, అతనే తన భర్తను చంపేసినట్టు ఆరోపణలు చేసింది. రోజులు గడిచాయి.. కానీ పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించలేకపోయారు. కాలంతో పాటు ఈ కేసు పక్కకు పడిపోయింది.
4ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మర్డర్ మిస్టరీని పరిష్కరించినట్టు పోలీసులు ప్రకటించారు. అరుణ్ ఇంటికి వెళ్లి.. ఆ గొయ్యి తవ్వి, చంద్రవీర్ అస్తికలను బయటకు తీశారు. కేసుకు సంబంధించి.. సవిత, ఆమె ప్రియుడు అరుణ్లను సోమవారం అరెస్ట్ చేశారు.
"కేసుకు సంబంధించి.. క్రైమ్ బ్రాంచ్కు ఇటీవలే కొన్ని క్లూలు దొరికాయి. వాటిని పట్టుకుని మళ్లీ దర్యాప్తు చేశాము. నిందితులను అరెస్ట్ చేశాము," అని పోలీసులు వెల్లడించారు. కాగా.. దర్యాప్తును ఎందుకు తిరిగి ప్రారంభించాల్సి వచ్చింది? అన్న విషయంపై అధికారులు స్పందించలేదు.
పోలీసుల ప్రకారం.. చంద్రవీర్ను.. సవిత, ఆమె ప్రియుడు తొలుత పిస్టోల్తో కాల్చారు. ఆ తర్వాత గొడ్డలితో నరికారు. నేరం కోసం వినియోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ప్రియురాలి శరీరాన్ని ముక్కలుగా నరికి..
Man kills live in partner : దేశంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ మహిళను, తన ప్రియుడు హత్య చేసి.. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం సృష్టించింది.
26ఏళ్ల శ్రద్ధ.. ముంబైలోని ఓ ఎంఎన్సీలో పని చేసేది. అక్కడే ఆమెకు అఫ్తబ్ అమీన్ పూనావాలా అనే వ్యక్తితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కానీ వారి ప్రేమకు ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. చివరికి.. వారిద్దరు ముంబైని విడిచి ఢిల్లీకి వెళ్లారు.
ఈ ఏడాది తొలినాళ్లల్లో.. ఢిల్లీలోని మెహ్రౌలిలో ఓ ఫ్లాట్ తీసుకుని ఇద్దరు కలిసి సహజీవనం మొదలుపెట్టారు. ఇలా రోజులు గడిచాయి. కానీ ఓరోజు.. శ్రద్ధను ఆ వ్యక్తి చంపేశాడు. శరీరాన్ని 35 ముక్కలుగా నరికి.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.