PM Modi disqualification : 'ప్రధాని మోదీపై అనర్హత వేటు' పిటిషన్ కొట్టివేత..
29 April 2024, 16:32 IST
PM Modi disqualification plea : ప్రధాని మోదీపై అనర్హత వేటు వేయాలని,ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ని దిల్లీ హైకోర్టు కొట్టేసింది. మోదీ ప్రసంగాల చుట్టూ నెలకొన్న వివాదం ఇది.
ప్రధాని మోదీపై అనర్హత వేటు' పిటిషన్ కొట్టివేత..
PM Modi disqualification : 2024 లోక్సభ ఎన్నికల్లో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై 6ఏళ్ల పాటు అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్ని దిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఎన్నికల కమిషన్.. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నందను, తాము ఎలాంటి నిర్ణయం తీసుకోమని దిల్లీ హైకోర్టు చెప్పింది.
మోదీపై అనర్హత వేటుకు పిటిషన్ కొట్టివేత..
దేవుడు, ప్రార్థనా మందిరాన్ని ఉపయోగించుకుని.. ఉత్తర్ ప్రదేశ్ పిలిబిట్లో ప్రధాని మోదీ ప్రసంగాలు చేశారని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని వ్యాజ్యంలో పేర్కొన్నారు పిటిషనర్, న్యాయవాది ఆనంద్ ఎస్ జొంధాలే. మోదీ.. 6ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొకుండా ఆదేశాలివ్వాలని కోరారు.
"ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందని మీరే ముందుగా ఊహించేసుకున్నారు. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఇలా చెయ్, అలా చెయ్ అని ఈసీకి మేము చెప్పలేము. మీరు ఇప్పటికే ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్లారు. ఈ ఫిర్యాదుపై ఈసీ సొంతంగా నిర్ణయం తీసుకోగలదు," అని జస్టిస్ సచిన్ దత్తాతో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్ పేర్కొంది.
Delhi high court on PM Modi : ఫిర్యాదును ఈసీ పరిశీలిస్తుందని, తగిన చర్యలు తీసుకుంటుందని.. ఎన్నికల సంఘం తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది సిద్ధాంత్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చూడండి:- Lok Sabha election : మొబైల్ నెంబర్తో మీ పోలింగ్ స్టేషన్ లొకేషన్ని ఇలా తెలుసుకోండి..
ప్రధాని మోదీ.. తన ప్రచారాలతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. రాజస్థాన్ సభలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారని పేర్కొంది.
"తల్లులు, సోదరీమణుల బంగారం తీసుకుని.. ఇతరులకు పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. వారు ఎవరికి పంచుతారు? దేశ ఆస్తులపై మొదటి హక్కు ముస్లింలకే ఉంటుందని గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చెప్పింది," అని ఇటీవల ఓ ర్యాలీలో కామెంట్ చేశారు మోదీ.
"ముస్లింలకు దేశ ఆస్తులపై మొదటి హక్కు ఉంటుందని గత పాలనలో కాంగ్రెస్ చెప్పింది. అంటే.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు, ఈ ఆస్తులను ఎవరికి పంచుతారు? ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికే పంచుతారు. చొరబాటుదారులకు పంచుతారు. మీ కష్టార్జితం.. చొరబాటుదారుల చేతుల్లోకి వెళ్లాలా? మీరు ఒప్పుకుంటారా?" అని మోదీ అన్నారు.
PM Modi disqualification plea Delhi high court : వాస్తవానికి.. 1951 రిప్రెజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం.. దేవుడు, దైవం, ప్రార్థనా మందిరాలు, మతాలతో ఓటును అడగడం నిషేధం. ఇది నేరపూరితం.
ఇక.. మోదీ వ్యాఖ్యాలను పరిశీలించిన ఎన్నికల సంఘం.. స్టార్ క్యాంపైనర్లు.. వారి స్థాయికి తగ్గట్టు ప్రసంగాలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సూచించింది.
2024 లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 3వ దశ మే 7న జరగనుంది. మొత్తం 7 దశల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.