తెలుగు న్యూస్  /  National International  /  6-yr-old Sacrificed By Two Men In Delhi To Propitiate Deity

6year old boy sacrificed : ఆరేళ్ల బాలుడి హత్య.. 'బాబాకు త్యాగం' నెపంతో దారుణం!

Sharath Chitturi HT Telugu

02 October 2022, 17:00 IST

    • 6year old boy killed : ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఓ 6ఏళ్ల బాలుడి ఇద్దరు గొంతు కోసి చంపేశారు. బాబాకు త్యాగం ఇచ్చామని పోలీసులకు చెప్పారు. అసలేం జరిగిందంటే…
ఆరేళ్ల బాలుడి హత్య.. 'బాబాకు త్యాగం' నెపంతో దారుణం
ఆరేళ్ల బాలుడి హత్య.. 'బాబాకు త్యాగం' నెపంతో దారుణం

ఆరేళ్ల బాలుడి హత్య.. 'బాబాకు త్యాగం' నెపంతో దారుణం

Delhi crime news : ఢిల్లీలో మరో దారణ ఘటన వెలుగులోకి వచ్చింది. లోధా కాలెనీలో నిర్మాణంలో ఉన్న ఓ సీఆర్​పీఎఫ్​ కార్యాలయానికి సమీపంలో ఓ బాలుడి మృతదేహం లభించింది. నవరాత్రుల నేపథ్యంలో.. దేవుడికి ప్రసన్నం చేసుకునేందుకు నిందితులు ఈ హత్యకు పాల్పడ్డారు!

ట్రెండింగ్ వార్తలు

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​ బరేలీ నుంచి వచ్చిన ఓ కుటుంబం.. సీఆర్​పీఎఫ్​ ప్రధాన కార్యాలయం నిర్మాణంలో పనికి చేరింది. వారికి ఓ ఆరేళ్ల బిడ్డ ఉన్నాడు.

కాగా.. శనివారం అర్ధరాత్రి 12:40 గంటల సమయంలో.. భవనానికి సమీపంలో ఓ బాలుడి మృతదేహాన్ని కూలీలు గుర్తించారు. అతడి గొంతు కోసేసి ఉండటంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అటుగా వెళుతున్న నిందితులను వారందరు పట్టుకున్నారు. మరణించింది.. తమ బిడ్డే అని తెలిసి.. ఆ వలస కుటుంబం విలపించింది.

6year old boy sacrificed in Delhi : ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకుని అరెస్ట్​ చేశారు. విచారణలో భాగంగా నిందితులు.. బిహార్​కి చెందిన 23ఏళ్ల విజయ్​ కుమార్​, 21ఏళ్ల అమర్​ కుమార్​.. నిజాన్ని ఒప్పుకున్నారు.

"నిందితులు ఇద్దరు కలిసి గంజా కొట్టేవారు. వారు కూడా భవన నిర్మాణంలో పనిచేసిన కూలీలే. గంజా కొడుతున్న వారిద్దరని స్థానికులు మందలించారు. దాంతో వారిద్దరు కోపం పెంచుకున్నారు. ఇక తన కలలోకి భోలే బాబా వచ్చాడని, ఓ బాలుడి మెడ కోసేయాలని ఆదేశించినట్టు నిందితుల్లో ఒకడు చెప్పాడు. ఈ క్రమంలోనే 6ఏళ్ల బాలుడిని చంపేశారు. అలా చేస్తే శాంతి జరుగుతుందని వారు భావిస్తున్నారు," అని పోలీసులు వెల్లడించారు.

శనివారం రాత్రి.. బాలుడు తన షెడ్డుకు వెళుతుండగా.. అతడిని ఆ ఇద్దరు పిలిపించారు. వారిద్దరు ముందే తెలుసు కాబట్టి.. బలవంతం లేకుండానే వారి వద్దకు వెళ్లాడు బాధితుడు. ఈ క్రమంలోనే అతడిని చంపేశారు.

బాధితుడి కుటుంబసభ్యలు.. నిందితులపై తీవ్ర ఆరోపణలు చేశారు. దుర్గా పూజల వేళ త్యాగాలు చేస్తే.. శాంతి లభిస్తుందని ఆ ఇద్దరు తరచూ మాట్లాడేవారని ఆరోపించారు.

ఘటనపై దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు.