Maharashtra crime | బిర్యానీ వండలేదని భార్యను పొడిచేశాడు..
06 September 2022, 22:36 IST
Maharashtra crime | అడిగిన వెంటనే బిర్యానీ వండి పెట్టలేదని భార్యను కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడో భర్త. మహారాష్ట్రలోని లాతూర్ లో ఈ ఘటన జరిగింది.
ప్రతీకాత్మక చిత్రం
Maharashtra crime | మహారాష్ట్రలోని లాతూర్ లో నాందేడ్ రోడ్లో విక్రమ్ వినాయక్ డేడే కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మద్యపాన వ్యసనానికి లోనైన విక్రమ్ రోజూ తాగి వచ్చి భార్యను కొడుతుండేవాడు. ఆగస్ట్ 31 రాత్రి కూడా అలాగే, బాగా తాగేసి ఇంటికి వచ్చాడు. రాత్రి భోజనంలోకి బిర్యానీ చేయలేదని భార్య ను విచక్షణారహితంగా కొట్టాడు. అదే కోపంలో, అక్కడే ఉన్న కత్తిని తీసుకుని ఆమెను పొడిచారు. కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ.. వారిని తోసేసి మరీ.. పలుమార్లు కత్తితో పొడవడంతో తీవ్ర రక్త స్రావమై ఆమె అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయింది. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. నిందితుడైన విక్రమ్ పై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు.