Stock Market news today : స్టాక్ మార్కెట్లకు లాభాలు.. నిఫ్టీ 65 పాయింట్లు జంప్
23 January 2023, 9:17 IST
- Stock Market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.
ఇండియా స్టాక్ మార్కెట్
Stock Market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ను లాభాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 171 పాయింట్ల లాభంతో 60,792 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 67 పాయింట్లు పెరిగి 18,095 వద్ద ట్రేడ్ అవుతోంది.
అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టపోయాయి. నిఫ్టీ50.. 80 పాయింట్ల నష్టంతో 18,027 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్236 పాయింట్ల నష్టంతో 60,621 వద్ద స్థిరపడింది. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60875- 18119 వద్ద మొదలుపెట్టాయి.
పివోట్ ఛార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్ట్ 18,104- 17,983- 17,934 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 18,112- 18,143- 18,192 వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
గెయిల్ ఇండియా:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 96, టార్గెట్ రూ. 105
HDFC Bank share price target : హెచ్డీఎఫ్సీ బ్యాంక్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 1630, టార్గెట్ రూ. 1700- రూ. 1725
టాటా స్టీల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 114, టార్గెట్ రూ. 132
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు తీవ్రత తగ్గుతుందన్న అంచనాల మధ్య అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. డౌ జోన్స్ 1శాతం, ఎస్ అండ్ పీ 500 1.89శాతం, నాస్డాక్ 2.69శాతం మేర లాభపడ్డాయి.
Reliance Industries Q3 results: రిలయన్స్ క్యూ3 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 1శాతం లాభాల్లో ఉంది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 స్వల్ప లాభాల్లో ఉంది. షాంఘై, హాంగ్ కాంగ్ సూచీలకు నేడు సెలవు.
త్రైమాసిక ఫలితాలు..
Axis Bank Q3 results : యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కెనెరా బ్యాంక్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గ్లాండ్ ఫార్మా, గ్రావిటీ ఇండియా, హెచ్ఎఫ్సీఎల్, జమ్ముకశ్మీర్ బ్యాంక్, జిందాల్ స్టెయిన్లెస్తో పాటు పలు సంస్థల క్యూ3 ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2002.25కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1509.95కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.