Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 30 పాయింట్లు అప్
28 October 2022, 9:18 IST
- Stock market news today : దేశీయ సూచీలు లాభాల్లో ఓపెన్ అయ్యాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
స్టాక్ మార్కెట్ ఇండియా
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 59,899 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 37 పాయింట్లు వృద్ధి చెంది 17,774 వద్ద ట్రేడ్ అవుతోంది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. నిఫ్టీ50.. 80 పాయింట్ల లాభంతో 17,736 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 212 పాయింట్లు పెరిగి 59,756 వద్ద స్థిరపడింది. రియాల్టీ, గ్యాస్, మెటల్స్, పవర్ సెక్టార్ స్టాక్స్ లాభపడ్డాయి. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు 59,747- 17,756 వరుసగా వద్ద మొదలుపెట్టాయి.
పివొట్ ఛార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్టు 17,676- 17645 లెవల్స్ వద్ద ఉంది. ఇక నిఫ్టీ రెసిస్టెన్స్ 17,774- 17,805 వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
- Stocks to buy : సన్ ఫార్మా:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 900, టార్గెట్ రూ. 1030- 1050
- టాటా స్టీల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 100, టార్గెట్ రూ. 108-110
- కోల్ ఇండియా:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 225, టార్గెట్ రూ. 265
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, ఎయిర్టెల్, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.
సన్ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
టెక్ సంస్థల త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటంతో అమెరికా నాస్డాక్ సూచీ నష్టాల్లో ముగిసింది. డౌ జోన్స్ 0.61శాతం లాభపడగా, ఎస్ అండ్ పీ 500 0.61శాతం- నాస్డాక్ 1.63శాతం నష్టాల్లో ముగిశాయి.
ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.63శాతం, ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.49శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
చమురు ధరలు..
చమురు ధరలు పెరిగాయి. క్రూడ్ ధర 1.27 డాలర్లు పెరిగి.. బ్యారెల్కు 96.96 డాలర్లకు చేరింది.
త్రైమాసిక ఫలితాలు..
Maruti Suzuki Q2 results : మారుతీ సుజుకీ ఇండియా, డా. రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, వేదాంత, టాటా పవర్, బంధన్ బ్యాంక్, బ్లూ డార్ట్ ఎక్స్ప్రెస్, సీసీఎల్ ప్రాడక్ట్స్, ఎవరేడీ ఇండస్ట్రీస్ ఇండియా, ఎన్ఐఐటీ, సటిన్ క్రెడిట్కేర్ నెట్వర్క్, సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫార్జింగ్స్తో పాటు ఇతర సంస్థల త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
ఐఓసీ, ఎన్టీపీసీ, అలంకిట్, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్తో పాటు ఇతర సంస్థల త్రైమాసిక ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో రూ. 2,810.40కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు ఎఫ్ఐఐలు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 1,580.10కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.