Electric vehicles in India : ‘2030 నాటికి.. ఇండియాలో 2కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు’
13 February 2023, 7:28 IST
- Electric vehicles in India : 2030 నాటికి ఇండియాలో 2కోట్లకుపైగా ఈవీలు ఉంటాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈవీలతో కాలుష్యం తగ్గడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు.
‘2030 నాటికి.. ఇండియాలో 2కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు’
Electric vehicles in India : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లల్లో ఈవీలను కొనుగోలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి దేశంలో 2కోట్లకుపైగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ రోడ్ల మీద తిరుగుతాయని అన్నారు. ఫలితంగా కాలుష్యం తగ్గుతుందని, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని స్పష్టం చేశారు.
ఈవీలతో వృద్ధి..
ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ ఫ్యూటర్ మొబిలిటీ థీమ్తో జరిగిన ఓ ఈవెంట్లో ఇటీవలే పాల్గొన్నారు నితిన్ గడ్కరీ. ఈ క్రమంలోనే దేశంలోని ఈవీ సెగ్మెంట్ వృద్ధిపై మాట్లాడారు.
India Electric vehicles : "2030 నాటికి 2 కోట్లకుపైగా ఈవీలు ఇండియాలో తిరుగుతాయి. కాలుష్యం తగ్గడంతో పాటు ఉద్యగాలు పెరుగుతాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధిచెందుతుంది. దేశం ఆత్మనిర్భరంగా మారుతుంది," అని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.
Electric car charging costs : మీ ఈవీ ఛార్జింగ్ ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సాధారణంగా.. పొల్యూషన్లో శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఉంటాయి. కాలుష్యంలో 40శాతం వాటా రవాణా రంగానిదని తెలిపారు కేంద్రమంత్రి. దానిని తగ్గించేందుకు కృషిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను పెంచాలని చూస్తున్నట్టు వెల్లడించారు.
Electric vehicles growth in India : "ఇంధన దిగుమతి ఇండియాకు పెద్ద సవాలే. దేశ ఆర్థిక వ్యవస్థలోని రూ. 16లక్షల కోట్లు.. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకే విదేశాలకు వెళతాయి. ఇంధన అవసరాల్లో 80శాతం దిగుమతే చేసుకుంటుంది ఇండియా. ఫలితంగా విదేశీ మారక నిల్వల్లో ఎక్కువ మొత్తాన్ని ఉపయోగించుకోవాల్సి వస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగితే.. ఇది దిగొస్తుంది," అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
ఈవీలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు కేంద్రమంత్రి. దీని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు సృష్టించుకోవచ్చని సూచించారు.
ఇప్పటికే 20లక్షల వాహనాలు..
ఎలక్ట్రిక్ వాహనాలపై భారతీయుల ఆసక్తి ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. ఆటో సంస్థల మధ్య నెలకొన్న పోటీతో ధరలు దిగొస్తుండటం కూడా ప్లస్ పాయింట్గా నిలుస్తోంది. 2021తో పోల్చుకుంటే 2022లో ఈవీ సెగ్మెంట్ 200శాతం వృద్ధిని సాధించింది! దేశంలో ఈవీ సేల్స్ 20లక్షల మైలురాయిని దాటినట్టు కేంద్ర విద్యుత్శాఖ వెల్లడించింది. కేవలం 6ఏళ్లల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.