Gold and silver rate today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్లో ఎంతంటే!
05 June 2023, 9:51 IST
- Gold and silver rate today : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్లాటీనం రేట్లు పెరిగాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..
Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 55,300గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర ఇంతే ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,53,000 వద్ద కొనసాగుతోంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,530గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 60,330గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,03,300గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,033గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,450గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,480గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,300 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 60,330గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,800గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,350గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,380గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,300గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,350గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,380గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,300గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,300గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 73,000గా కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 77,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 73,000.. బెంగళూరులో రూ. 74,500గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 50 పెరిగి రూ. 26,670గా ఉంది. క్రితం రోజు ఈ ధర రూ. 26,620గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,670గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.