తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 3 June 2023 Check Latest Prices In Telugu States

Gold and silver rates today : మళ్లీ రూ. 56వేలను తాకిన పసిడి- భారీగా పెరిగిన వెండి ధర!

Sharath Chitturi HT Telugu

03 June 2023, 6:17 IST

    • Gold and silver rates today : దేశంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. ప్లాటీనం రేట్లు సైతం పెరిగాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (PTI)

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 300 పెరిగి.. రూ. 56,000కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 55,700గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 3,000 పెరిగి, రూ. 5,60,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,600గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 340 వృద్ధి చెంది.. రూ. 61,100కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 60,760గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,110 పెరిగి.. రూ. 6,11,000గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,250గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 61,100గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,380గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,505గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 56,050గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,150గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,00గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,100గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,050గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,150గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,100గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,340గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 600 పెరిగి రూ. 73,400కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 72,800గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,400.. బెంగళూరులో రూ. 78,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 80 పెరిగి.. రూ 26,620కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,540గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,620గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)