తెలుగు న్యూస్  /  Telangana  /  Rain Alert To Telangana And Andhra Pradesh For Coming Days

Rain Alert To Telugu States : ఐఎండీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

HT Telugu Desk HT Telugu

06 October 2022, 11:38 IST

    • Weather Update : మరికొన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (unplash)

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని ఐఎండీ(IMD) అంచనా వేసింది. ఏపీ, తెలంగాణ, యానాంలో మూడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా రెండు ఉపరితల ఆవర్తనాలు ఉన్నాయి. దీంతో మరో రెండు మూడు రోజులు వర్షాలు(Rains) పడేందుకు అవకాశం ఉంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Siddipet District : సరిగ్గా చూసుకొని కొడుకు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్(Adilabad), నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అల్పపీడనం కారణంగా మూడు, నాలుగు రోజులపాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ్టి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం(Visakhapatnam) నగరం, అల్లూరిసీతామరాజు, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి మోస్తరు వర్షాలు పడతాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. కాకినాడ, కొనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయి.

గుంటూరు(Guntur), ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం బలపడి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయి. కర్నూలు(Kurnool), నంద్యాల, కడప, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అధికారులు హెచ్చరించారు.