తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shraddha Murder: ‘గ్రైండర్ తో ఎముకలను పొడిచేసి’.. శ్రద్ధ హత్యలో ఆఫ్తాబ్ దారుణాలు

Shraddha murder: ‘గ్రైండర్ తో ఎముకలను పొడిచేసి’.. శ్రద్ధ హత్యలో ఆఫ్తాబ్ దారుణాలు

HT Telugu Desk HT Telugu

07 February 2023, 19:03 IST

  • Shraddha murder case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాల్కర్ (Shraddha Walkar) హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ (Aaftab Poonawala) పాల్పడిన మరిన్ని దారుణాలు వెలుగు చూస్తున్నాయి.

శ్రద్ధ వాల్కర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్
శ్రద్ధ వాల్కర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ (HT_PRINT)

శ్రద్ధ వాల్కర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్

లివిన్ పార్ట్ నర్ శ్రద్ధ వాల్కర్ (Shraddha Walkar) ను హత్య చేసిన తరువాత ఆఫ్తాబ్ (Aaftab Poonawala) ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచిపెట్టాడు. ఆ తరువాత నెల రోజుల పాటు ఒక్కొక్కటిగా వాటిని దగ్గరలోని అటవీ ప్రాంతంలో పడేశాడు.

ట్రెండింగ్ వార్తలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

Shraddha murder case: పోలీస్ చార్జిషీట్ లో ఏముంది?

ఈ కేసులో ఆరు వేల పై చిలుకు పేజీలతో ఢిల్లీ పోలీసులు చార్జిషీటును రూపొందించి కోర్టుకు సమర్పించారు. అందులో నిందితుడు ఆఫ్తాబ్ పునావాలా (Aaftab Poonawala) క్రూరత్వాన్ని, Shraddha Walkar హత్యానంతరం నిందితుడు చేసిన దారుణాలను వెల్లడించారు. అధిక ఖర్చుల గురించి, ఆఫ్తాబ్ (Aaftab Poonawala) ఇతర గర్ల్ ఫ్రెండ్స్ గురించి వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తన మాట వినకుండా శ్రద్ధ ఆమె ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లడంపై ఆఫ్తాబ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ కోపంలోనే ఆమెను గొంతు నులిమి చంపేశాడు.

Shraddha murder case: గ్రైండర్ తో ఎముకలను పొడి చేసి..

హత్య చేసిన తరువాత మొదట Shraddha Walkar మృతదేహాన్నిప్లాస్టిక్ సంచిలో వేసి బయట వేద్దామనుకున్నాడు Aaftab Poonawala. కానీ, దొరికిపోతానని భయపడి ప్లాన్ మార్చుకున్నాడు. ఆ మృతదేహాన్ని చాకు, సుత్తి, పెద్ద కత్తి మొదలైన ఆయుధాలను ఉపయోగించి 35 ముక్కలు చేసి ఫ్రిజ్ లో పెట్టేశాడు. ఆమె ఎముకలను గ్రైండ్ చేయడానికి స్టోన్ గ్రైండర్ వాడాడు. ఎముకలను స్టోన్ గ్రైండర్ లో వేసి పొడి చేసి దాచిపెట్టాడు. బ్లో టార్చ్ ను ఉపయోగించి ఆమె చేతి వేళ్లను కట్ చేశాడు. శ్రద్ధ వాల్కర్ (Shraddha Walkar) మొబైల్ ఫోన్ ను ముంబైలో పడేశాడు. ఈ వివరాలను పోలీసుల విచారణలో నిందితుడు ఆఫ్తాబ్ వెల్లడించాడు. పోలీసులు తమ దర్యాప్తులో శ్రద్ధ వాల్కర్ (Shraddha Walkar) కు చెందిన సుమారు 20 శరీర భాగాలను సేకరించారు. శ్రద్ధను హత్య చేసిన తరువాత (Aaftab Poonawala) తాపీగా జొమాటో నుంచి చికెన్ రోల్ ను ఆర్డర్ చేసుకుని తిన్నాడు. 2020 మే శ్రద్ధ వాల్కర్, ఆఫ్తాబ్ ముంబై నుంచి వచ్చి ఢిల్లీలో సహజీవనం ప్రారంభించారు.