Shraddha Walkar murder case : ‘రంపం'తో శ్రద్ధను ముక్కలు ముక్కలుగా నరికిన అఫ్తాబ్!-aaftab poonawala cut shraddha walkar s body into pieces with saw reveals autopsy ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shraddha Walkar Murder Case : ‘రంపం'తో శ్రద్ధను ముక్కలు ముక్కలుగా నరికిన అఫ్తాబ్!

Shraddha Walkar murder case : ‘రంపం'తో శ్రద్ధను ముక్కలు ముక్కలుగా నరికిన అఫ్తాబ్!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 14, 2023 01:22 PM IST

Shraddha Walkar news : శ్రద్ధ వాల్కర్​ను హత్య చేసిన అఫ్తాబ్​ పూనావాలా.. ఆమె శరీరాన్ని రంపంతో ముక్కలుముక్కలుగా చేసినట్టు తెలుస్తోంది. శ్రద్ధా వాల్కర్​ ఎముకలపై నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం తెలిసినట్టు సమాచారం.

శ్రద్ధా వాల్కర్​- అఫ్తాబ్​
శ్రద్ధా వాల్కర్​- అఫ్తాబ్​ (HT_PRINT (File))

Shraddha Walkar murder case : శ్రద్ధా వాల్కర్​ హత్య కేసులో మరో వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రద్ధను హత్య చేసిన అఫ్తాబ్​ పూనావాలా.. ఆమె శరీరాన్ని రంపంతో ముక్కలు ముక్కలుగా నరికినట్టు తెలుస్తోంది.

శ్రద్ధను చంపి.. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి..

26ఏళ్ల శ్రద్ధా వాల్కర్​ను 28ఏళ్ల అఫ్తాబ్​ పూనావాలా.. గతేడాది మేలో ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్య చేశాడు. వీరిద్దరు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కాగా.. వీరి మధ్య తరచూ గొడవలు అవుతూ ఉండేవి! పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి చేయడంతో ఆమెను చంపేశాడు అఫ్తాబ్​. ఈ నేరం బయటకు రాకుండా.. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి.. తన ఫ్లాట్​లోని ఫ్రిడ్జ్​లో పెట్టాడు. వీలు దొరికినప్పుడల్లా.. వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీసుకెళ్లి.. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.

Shraddha Walkar news : స్నేహితుల ఫోన్​ కాల్స్​కు శ్రద్ధ స్పందించకపోవడంతో అసలు విషయం బయటపడింది. శ్రద్ధతో మాట్లాడి చాలా రోజులైందని.. ఆమె తండ్రికి కొందరు స్నేహితులు వివరించారు. అఫ్తాబ్​తో రిలేషన్​లో ఉండటం ఇష్టం లేకపోవడంతో.. శ్రద్ధతో కొన్నేళ్ల క్రితమే తెగదెంపులు చేసుకున్న ఆమె తండ్రి.. గతేడాది నవంబర్​లో ఢిల్లీకి వెళ్లాడు. శ్రద్ధ ఫ్లాట్​కు వెళ్లేసరికి.. అది లాక్​ చేసి ఉండటాన్ని గుర్తించాడు. అనుమానంతో పక్కనే ఉన్న పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. చివరికి.. అఫ్తాబ్​ నేరం బయటపడింది.

ఎములకపై పరీక్షతో..

కేసులో భాగంగా గత నెలలో.. మెహ్రౌలి అటవీ ప్రాంతంతో పాటు గురుగ్రామ్​లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. పోలీసులకు కొన్ని ఎముకలు లభించాయి. వాటిని డీఎన్​ఏ పరీక్షలకు తరలించారు. అవి శ్రద్ధా వాల్కర్​వేనని డీఎన్​ఏ పరీక్షలో తేలింది. బాధితురాలి తండ్రి డీఎన్​ఏను తీసుకుని ఈ పరీక్షలు చేశారు. ఆమె ఫ్లాట్​లో పోలీసులు గుర్తించిన రక్తం కూడా శ్రద్ధదే అని తేలింది.

Aaftab Poonawala latest news : ఢిల్లీలోని ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్స్​ (ఎయిమ్స్​)లో శ్రద్ధ ఎములకలపై అటాప్సీ నిర్వహించారు. కాగా.. ఆమె శరీరాన్ని రంపంతో ముక్కలు ముక్కలుగా నరికినట్టు అటాప్సీ నివేదికలతో బయటపడింది!

మరోవైపు సంబంధిత రంపం, బ్లేడుతో పాటు శ్రద్ధను హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసేందుకు ఉపయోగించిన ఆయుధాలను.. గురుగ్రామ్​లోని వివిధ ప్రాంతాల్లో అఫ్తాబ్​ పడేసినట్టు తెలుస్తోంది.

Aaftab Poonawala Shraddha Walker case : ఈ వార్త గతేడాది నవంబర్​లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడు అఫ్తాబ్​ పూనావాలాను పోలీసులు అదే నెలలో అరెస్ట్​ చేశారు. ఈ నెలలో నిందితుడిపై ఛార్జ్​షీట్​ దాఖలు చేసే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం