Telugu News, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, తాజా వార్తలు – Hindustan Times Telugu

Telugu News

Published Apr 24, 2025 09:19 PM IST
రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో ఆర్సీబీ.. రాయల్స్ ముందు భారీ లక్ష్యం ఉంచింది.
Published Apr 24, 2025 09:40 PM IST
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఉచిత ఆన్ లైన్ కోచింగ్ ను ప్రారంభించింది. ఆచార్య యాప్ తో సేవలను అందించనుంది. ఈ మేరకు మంత్రి సవిత… ఉచిత డీస్సీ కోచింగ్ ను ప్రారంభించారు. 
Published Apr 24, 2025 08:45 PM IST
రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది.  ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. పలుచోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నంద్యాల జిల్లాలోని దోర్నిపాడులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది.
Published Apr 24, 2025 08:50 PM IST
ప్రియాంకా చోప్రా నటించిన ఓ యాక్షన్ కామెడీ మూవీ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేస్తూ.. మూవీ స్ట్రీమింగ్ తేదీని ప్రియాంకా వెల్లడించింది.
Published Apr 24, 2025 07:33 PM IST
ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 25వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే అభ్యర్థుల హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏప్రిల్ 27వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి.
Published Apr 24, 2025 08:02 PM IST
గేమ్ ఛేంజర్ మూవీ కథ, స్క్రీన్ ప్లేను పూర్తిగా మార్చేశారని తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను అనుకున్న ప్రపంచం ఒకటి కాగా.. అది పూర్తిగా వేరేగా మారిపోయిందని అతడు అనడం గమనార్హం.
Published Apr 24, 2025 06:28 PM IST
ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) అగ్రస్థానంలో నిలిచింది. ఇతర విశ్వవిద్యాలయాల జాబితాను ఇక్కడ పరిశీలించండి. 
Published Apr 24, 2025 06:14 PM IST
ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ బోర్డు అప్డేట్ ఇచ్చింది. జూన్‌ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను పేర్కొంది.
Published Apr 24, 2025 06:33 PM IST
పుష్ప 2 టీవీ ప్రీమియర్ కు ఊహించినదాని కంటే చాలా తక్కువ టీఆర్పీ రేటింగ్ నమోదైంది. అయితే రెండంకెల రేటింగ్ మాత్రం అందుకుంది. మిగిలిన మూడు భాషల్లోనూ ఫర్వాలేదనిపించింది. పుష్ప పార్ట్ 1తో పోలిస్తే.. ఇది పుష్ప 2కి తక్కువే నమోదైంది.
Published Apr 24, 2025 05:53 PM IST
6.67 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లతో ఒప్పో తన లేటెస్ట్ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ5 5జీని భారత్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
Published Apr 24, 2025 05:28 PM IST
ఐపీఎల్ 2025లో సగానికిపైగా లీగ్ మ్యాచ్ లు ముగిశాయి. ప్రతి టీమ్ కనీసం ఎనిమిదేసి మ్యాచ్ లు ఆడాయి. ఈ నేపథ్యంలో పాయింట్ల టేబుల్ ఎలా ఉంది? సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీమ్స్ పనైపోయినట్లేనా? ఇంకా ఛాన్స్ ఉందా? ఒకసారి చూద్దాం.
Published Apr 24, 2025 07:06 PM IST

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వీడియో రూపంలో తన అభిప్రాయాన్ని సస్పెన్షన్ పై తెలియజేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్సిపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published Apr 24, 2025 05:37 PM IST
ఏపీ ఈసెట్-2025 కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఫైన్ తో ఇంకా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా.. తాజాగా ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి వివరాలను సవరించుకోవచ్చని అధికారులు తెలిపారు.
Published Apr 24, 2025 04:57 PM IST
సీరియల్‌లో తల్లీకొడుకులుగా నటించిన బిగ్ బాస్ జంట కిష్వర్ మర్చంట్, సుయాష్ రాయ్ రియల్ లైఫ్‌లో మాత్రం భార్యాభర్తలుగా మారారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. హిందీ బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న కిషర్ మర్చంట్, సుయాష్ రాయ్ లవ్ స్టోరీ, పెళ్లి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాయి.
Published Apr 24, 2025 04:43 PM IST
గత ఏడు సెషన్లుగా కొనసాగుతున్న భారత స్టాక్ మార్కెట్ విజయ యాత్రకు గురువారం బ్రేక్ పడింది. గురువారం సెన్సెక్స్ 315 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టంతో 79,801.43 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 24,246.70 వద్ద స్థిరపడ్డాయి.
Published Apr 24, 2025 04:01 PM IST
కశ్మీర్లోని పహల్గామ్ లో దారుణమైన ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, క్షిపణి ప్రయోగం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కరాచీ తీరంలో ఉపరితలం నుంచి ఉపరితలానికి క్షిపణిని ప్రయోగిస్తున్నట్లు పాకిస్థాన్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం.
Published Apr 24, 2025 04:42 PM IST
జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నీకు సిగ్గుండాలి అంటూ ఆ దేశ ప్రధానిపైనా కామెంట్స్ చేయడం గమనార్హం. ఇప్పుడతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Published Apr 24, 2025 04:36 PM IST
 తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను వేలం వేయనుంది. మే 1, 2 తేదీల్లో ఈ-వేలం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
Published Apr 24, 2025 04:30 PM IST
ఆకస్మిక కారణాల వల్ల విమానాలను రద్దు చేయడం చాలాసార్లు జరిగే రొటీన్ ప్రక్రియ. అలాంటి సమయంలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బంది పడతారు. ఇలాంటి సందర్భాల్లో విమానయాన సంస్థలు ప్రయాణికులకు అనేక హక్కులను అందిస్తుంది. కానీ హక్కుల గురించి తెలిసింది చాలా తక్కువ మందిదే.
Published Apr 24, 2025 04:30 PM IST
  • మే నెలలో అనేక గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. గ్రహాల రాశిచక్రాన్ని మార్చడం వల్ల కలిగే ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగా ఉంటుంది. మే నెలలో అదృష్ట రాశుల గురించి తెలుసుకోండి. 

Loading...