తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Greece Train Crash : రెండు రైళ్లు ఢీ.. 16మంది దుర్మరణం!

Greece train crash : రెండు రైళ్లు ఢీ.. 16మంది దుర్మరణం!

Sharath Chitturi HT Telugu

01 March 2023, 7:44 IST

  • Greece train crash today : గ్రీస్​ దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16మంది ప్రాణాలు కోల్పోయారు.

ఘోర రైలు ప్రమాదం.. 16మంది దుర్మరణం
ఘోర రైలు ప్రమాదం.. 16మంది దుర్మరణం (REUTERS)

ఘోర రైలు ప్రమాదం.. 16మంది దుర్మరణం

Greece train crash today : ఘోర రైలు ప్రమాదంతో గ్రీస్​ దేశం ఉలిక్కిపడింది. ఓ ప్యాసింజర్​ రైలు, మరో గూడ్స్​ ట్రైన్​ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 16మంది మరణించారు. మరో 85మంది గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

పట్టాలు తప్పిన బోగీలు.. చెలరేగిన మంటలు!

గ్రీస్​లోని అథెన్స్​కు 235 మైళ్ల దూరంలో ఉన్న టెంపే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది ఈ ఘటన. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి పరుగులు తీసి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

Greece train crash : ప్రమాదం ధాటికి అనేక బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలకు మంటలు అంటుకున్నాయి. 85మందిని వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. మరో 250మందిని బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేశారు అధికారులు.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఘటనాస్థలంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. "చాలా భయమేసింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ప్రజలందరు అరవడం మొదలుపెట్టారు," అని ప్రయాణికుడు మీడియాకు వివరించాడు. 'భూకంపం సంభవించినట్టు అనిపించింది,' అని మరో ప్రయాణికుడు చెప్పాడు.

రంగంలోకి సైన్యం..

Greece train crash death toll : సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది గ్రీస్​ ప్రభుత్వం. కాగా.. ప్రమాదానికి గురైన ప్యాసింజర్​ రైలు.. అథెన్స్​ నుంచి థెస్సలోనికి అనే ప్రాంతానికి వెళుతున్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 350మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదం ధాటికి ప్యాసింజర్​ రైలు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు భారీ క్రేన్​ వంటి పరికరాలను రప్పిస్తున్నారు.