Stock market news today : ఫ్లాట్గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 10 పాయింట్ల లాభం
20 February 2023, 9:16 IST
- Stock market news today : ఇండియా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి.
ఇండియా స్టాక్ మార్కెట్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 61,097 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 11 పాయింట్లు పెరిగి 17,955 వద్ద ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పవనాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టపోయాయి. 316 పాయింట్లు పడిన బీఎస్ఈ సెన్సెక్స్ 61,002 వద్ద ముగిసింది. 91 పాయింట్లు పతనమైన నిఫ్టీ.. 17,944 వద్ద స్థిరపడింది. 499 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్ నిఫ్టీ 41,131 వద్దకు చేరింది. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 61,113- 17,965 వద్ద మొదలుపెట్టాయి.
స్టాక్స్ టు బై..
Stocks to buy list : గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రాడక్ట్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 925, టార్గెట్ రూ. 960- రూ. 970
Berger paints share price target : బర్జర్ పెయింట్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 555, టార్గెట్ రూ. 580- రూ. 590
రాడికో ఖైతన్:- బై రూ. 1125, స్టాప్ లాస్ రూ. 1105, టార్గెట్ రూ. 1165
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
Stock market news : పవర్ గ్రిడ్, ఎల్టీ, సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
విప్రో, హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు తీవ్రత కొనసాగుతుందన్న భయం మదుపర్లలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.39శాతం లాభపడగా.. ఎస్ అండ్ పీ 500 0.28శాతం, నాస్డాక్ 0.58శాతం మేర నష్టపోయాయి.
US Stock market investment in Telugu : ఆసియా మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.02శాతం నష్టాల్లో ఉంది. సౌత్ కొరియా కాస్పీ 0.3శాతం లాభాల్లో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.2శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.
చమురు ధరలు..
చమురు ధర 2.14 డాలర్లు పడి బ్యారెల్కు 83 డాలర్ల వద్దకు చేరింది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం దీనిపై కొనసాగుతోంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడంగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 624.61కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు కూడా రూ. 85.29కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
కాగా.. దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 1,408.36కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.