తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today, Check Latest Price In Hyderabad And Vijayawada 12 November

Gold and silver rates today : స్వల్పంగా పెరిగిన పసిడి, తగ్గిన వెండి ధరలు..

12 November 2022, 6:08 IST

    • Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇలా.. (Mohammed Aleemuddin )

మీ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 47,810కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 47,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 4,78,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 4,781గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 52,160కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 52,150గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 5,21,600గా ఉంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,010గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,370గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,810 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 52,160గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 49,050గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,510గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 47,840గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 52,190గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 47,810గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,160గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 47,860గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 52,210గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 47,810గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,160గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,170గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 200 దిగొచ్చి.. 61,700కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 61,700గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 67,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 67,800.. బెంగళూరులో రూ. 67,800గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం భారీగా పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 840 పెరిగి.. రూ 26,780కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,940గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,780గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)