తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Announced Kerala Hills And Waters Tour Package

IRCTC Kerala Tour : కేరళ చూడాలని ఉందా? ఇదిగో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

Anand Sai HT Telugu

10 October 2022, 18:40 IST

    • Hyderabad To Kerala Tour Package Details : కేరళ అందాలను చూడాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. కేరళ హిల్స్ అండ్ వాటర్స్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేరళ(Kerala)లోని అందాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ(IRCTC Tour Package ప్రకటించింది. కేరళలోని ముఖ్యమైన ప్రదేశాలను చూసి రావొచ్చు. హైదరాబాద్(Hyderabad) నుంచి కేరళకు టూర్ ప్యాకేజీని అందిస్తోంది.. 'KERALA Hills And WATERS' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో అలెప్పీ, మున్నార్ తోపాటుగు మరికొన్ని ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. అక్టోబర్ 18న అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

TS POLYCET 2024 Updates : నేటితో ముగియనున్న పాలిసెట్‌ దరఖాస్తుల గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

Karimnagar : నిప్పుల కొలిమిలా కరీంనగర్ , వచ్చే నాలుగు రోజుల్లో 42-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

TS Inter Supplementary Schedule : టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులు, మే 23 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు

KCR Joins Twitter : ఎక్స్ లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్, కాంగ్రెస్ కరెంట్ విచిత్రాలంటూ పోస్ట్

Day 1 : రైలు నెంబర్ 17230, శబరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12:20 గంటలకు ట్రైన్ ఉంటుంది. ఓవర్ నైట్ జర్నీ చేయాలి.

Day 2 : 12:55 గంటలకు ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పికప్ చేసుకుని మున్నార్‌ తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. మున్నార్ టౌన్‌లోనే సాయంత్రం విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి బస కూడా అక్కడే చేస్తారు.

Day 3 : ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్ సందర్శన ఉంటుంది. తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఎకో-పాయింట్ సందర్శన ఉంటుంది. మున్నార్‌లో రాత్రి బస చేస్తారు.

Day 4 : చెక్ అవుట్ చేసి అలెప్పీకి బయలుదేరాలి. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. బ్యాక్‌వాటర్‌ను ఎంజాయ్ చేయోచ్చు. రాత్రిపూట అలెప్పీలోనే బస చేస్తారు.

Day 5 : చెక్ అవుట్ చేసి ఎర్నాకులానికి వెళ్లాలి. రైలు నెంబర్ 17229, శబరి ఎక్స్‌ప్రెస్ 11:20 గంటలకు ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్‌లో ఉంటుంది.

Day 6 : 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ఈ ప్యాకేజీ ధరలు చూసుకుంటే.. సింగిల్ షేరింగ్ కు రూ. 29830 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 17240 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14300గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి.