తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bumrah On Missing Out T20 World Cup: చాలా బాధగా ఉంది: బుమ్రా ట్వీట్‌

Bumrah on missing out T20 World Cup: చాలా బాధగా ఉంది: బుమ్రా ట్వీట్‌

Hari Prasad S HT Telugu

04 October 2022, 11:52 IST

    • Bumrah on missing out T20 World Cup: చాలా బాధగా ఉంది అంటూ టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌ నుంచి తప్పుకున్న తర్వాత బుమ్రా ట్వీట్‌ చేశాడు. అతడు గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే.
జస్‌ప్రీత్‌ బుమ్రా
జస్‌ప్రీత్‌ బుమ్రా (AFP)

జస్‌ప్రీత్‌ బుమ్రా

Bumrah on missing out T20 World Cup: ఇండియన్‌ టీమ్‌ స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా టీ20 వరల్డ్‌కప్‌కు దూరం కావడంపై స్పందించాడు. వెన్ను గాయం కారణంగా అతడు ఈ మెగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. సోమవారం (అక్టోబర్‌ 3) బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా.. మంగళవారం (అక్టోబర్‌ 4) ఉదయం అతడు ఓ ట్వీట్‌ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

తనకు చాలా బాధగా ఉన్నట్లు చెప్పాడు. "ఈసారి టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లో భాగంగా కాలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ నా ప్రియమైన వారి నుంచి అందిన సందేశాలు, మద్దతు, ప్రేమకు కృతజ్ఞుడిని. నేను కోలుకోగానే ఆస్ట్రేలియాలో ఆడుతున్న టీమ్‌ను చీర్‌ చేస్తాను" అని బుమ్రా ట్వీట్‌ చేశాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20కి వెన్ను గాయం కారణంగా దూరమైన బుమ్రా.. తర్వాత సిరీస్‌ మొత్తానికీ దూరమయ్యాడు.

అప్పుడే అతడు వరల్డ్‌కప్‌ కూడా ఆడబోవడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించినా.. అధికారిక ప్రకటన మాత్రం సోమవారం రిలీజైంది. ఇన్నాళ్లూ అతన్ని బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షించింది. అయితే అతని పరిస్థితిని అంచనా వేసి, స్పెషలిస్ట్‌లను సంప్రదించిన తర్వాత బుమ్రాను పంపకూడదని నిర్ణయించినట్లు బీసీసీఐ వెల్లడించింది.

వరల్డ్‌కప్‌లో అతని స్థానంలో ఎవరు అన్నది మాత్రం బోర్డు ఇంకా చెప్పలేదు. గాయం కారణంగా బుమ్రా ఆసియాకప్‌కు కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతడు లేని లోటు ఆ టోర్నీలో తెలిసి వచ్చింది. డెత్‌ ఓవర్లలో ఇబ్బంది పడిన టీమ్‌.. చివరికి ఫైనల్‌ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో అతడు రెండు టీ20లు ఆడినా.. పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

ఇక ఇప్పుడు బుమ్రా లేకుండా వరల్డ్‌కప్‌లో ఆడటం ఇండియాకు సవాలే. ఇప్పటికీ డెత్‌ ఓవర్ల సమస్య వేధిస్తోంది. సీనియర్‌ బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌లాంటి వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రా లేని లోటు కచ్చితంగా కనిపిస్తుంది. బుమ్రా స్థానంలో షమి లేదా దీపక్‌ చహర్‌ 15 మంది సభ్యుల టీమ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.