Ban on mobile phones in temples : రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో.. సెల్ఫోన్లపై నిషేధం!
03 December 2022, 13:59 IST
- Ban on mobile phones in temples : తమిళనాడు ఆలయాల్లో సెల్ఫోన్లపై నిషేధం విధించాలని మద్రాసు హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ ఆదేశాలిచ్చింది. ఆలయాల పవిత్రత, స్వచ్ఛతను పరిరక్షించేందుకు.. సెల్ఫోన్లపై నిషేధం విధించాలని పేర్కొంది.
రాష్ట్రంలోని ఆలయాల్లో.. మొబైల్ ఫోన్స్పై నిషేధం
Ban on mobile phones in temples : తమిళనాడు ప్రభుత్వం.. రాష్ట్రంలోని అన్ని ఆలయ ప్రాంగణాల్లో సెల్ఫోన్ వినియోగంపై నిషేధం విధించనుంది. ఈ మేరకు.. మద్రాసు హైకోర్టుకు చెందిన మధురై బెంచ్.. కమిషనర్ ఆఫ్ హిందూ రిలీజియస్ అండ్ ఛారిటీస్ ఎన్డోమెంట్స్ డిపార్ట్మెంట్(హెచ్ఆర్ అండ్ సీఈ)కు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులోని ఆలయాల పవిత్రత, స్వచ్ఛతను పరిరక్షించేందుకు.. సెల్ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టం చేసింది.
తిరుచెందూర్లోని అరుల్మిగు సుబ్రహ్మణియ స్వామి ఆలయంలో సెల్ఫోన్లపై నిషేధం విధించాలని.. సీతారామన్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ మేరకు తీర్పును వెలువరించింది.
Ban on phones in temples : "భక్తుల భద్రత, ఆలయాల పవిత్రను కాపాడేందుకు.. దేవాలయాల ప్రాంగణంలో సెల్ఫోన్ వినియోగాన్ని నిషేధించాలి. ఈ బాధ్యతను ఆలయ సిబ్బంది కఠినంగా పాటించాలి. సెల్ఫోన్లు, కెమెరాలు వాడుతుంటే.. భక్తులు శ్రద్ధతో ఉండటం లేదు," అని జస్టిస్ ఆర్ మాహదేవన్, జస్టిస్ జే సత్యనారాయణ ప్రసాద్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.
తమిళనాడులోని ముధరై మీనాక్షి ఆలయం, గురువాయూర్లోని శ్రీ కృష్ణాలయంతో పాటు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సెల్ఫోన్ వినియోగంపై నిషేధం.
సెల్ఫోన్పై నిషేధంతో పాటు.. ఆలయాల్లో సరైన డ్రెస్ కోడ్ను అనుసరించే విధంగా చర్యలు చేపట్టాలని హెచ్ఆర్ ఎండ్ సీఈకి ఆదేశాలిచ్చింది బెంచ్.
ఆలయాల్లో వైద్య కేంద్రాలు..
మరోవైపు.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం.. ఐదు ఆలయాల్లో వైద్య కేంద్రాలను ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్ధం ఇవి ఉపయోగపడనున్నాయి.
మధురై మీనాక్షి ఆలయం, ఇరుక్కన్కుడి మరియమ్మ ఆలయం, బన్నరియమ్మ ఆలయం, మధురై కల్లర్గడ్ ఆలయం, శంకరనారాయణ స్వామి ఆలయాల్లో వైద్య సేవలను ప్రారంభించారు. వీటితో పాటు గతేడాది 10 ఆలయాల్లో వైద్య సేవలను మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.