Tirumala Temple : ఆ రోజున శ్రీవారి ఆలయం 11 గంటలు మూసివేత
06 November 2022, 21:22 IST
- Lunar Eclipse : చంద్రగ్రహణం కారణంగా నవంబరు 8న మంగళవారం ఉదయం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించరు.
తిరుమల ఆలయం
చంద్రగ్రహణం కారణంగా నవంబరు 8న గంటల వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయి. బ్రేక్ దర్శనం రద్దు చేశారు. నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించరు. మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుండి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది.
చంద్రగ్రహణం కారణంగా శ్రీవాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీకి కోరింది.
చంద్రగ్రహణం కారణంగా నవంబరు 8న మంగళవారం ఉదయం 8.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు టీటీడీ స్థానికాలయాల తలుపులు మూసివేస్తారు. స్థానికాలయాల్లో ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.
మధ్యాహ్నం 2.39 గంటల నుండి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ఈ మేరకు కార్యక్రమాలు జరుగుతాయి. తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో రాత్రి 8 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు అభిషేకం, రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు అలంకారం,నివేదన, దీపారాధన, రాత్రి 10 నుండి 10.15 గంటల వరకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.