తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mamata On Pm Modi : తొలిసారి మోదీపై సానుకూలంగా మాట్లాడిన దీదీ.. అదే కారణమా?

Mamata on PM Modi : తొలిసారి మోదీపై సానుకూలంగా మాట్లాడిన దీదీ.. అదే కారణమా?

Sharath Chitturi HT Telugu

19 September 2022, 22:10 IST

  • Mamata on PM Modi : మమతా బెనర్జీ.. తొలిసారి మోదీపై సానుకూలంగా మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఆరోపణలపై స్పందించిన ఆమె.. అందులో మోదీ పాత్ర ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

మమతా బెనర్జీ
మమతా బెనర్జీ (Hindustan Times/file)

మమతా బెనర్జీ

Mamata comments on PM Modi : దేశ రాజకీయాల్లో సోమవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిత్యం నిప్పులు చెరిగే పశ్చిమ్​ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ.. తొలిసారిగా ఆయనపై సానుకూలంగా మాట్లాడారు! అది కూడా.. దేశంలో హాట్​టాపిక్​గా మారిన కేంద్ర దర్యాప్తు సంస్థల 'దుర్వినియోగం' విషయంలో కావడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Unnatural intercourse: ‘‘భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం చేయడం రేప్ కిందకు రాదు’’ - ఎంపీ హైకోర్టు

ఇటీవలి కాలంలో సీబీఐ, ఈడీలు జోరుగా తమ పని సాగిస్తున్నాయి. అనేకమంది రాజకీయ నేతలపై కేసులు వేసి, విచారిస్తున్నాయి. అయితే.. విపక్షాలను అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ చేస్తున్న కుట్ర అని అనేక వర్గాలు ఆరోపించాయి. కాంగ్రెస్​, టీఎంసీ, శివసేన వంటి విపక్ష పార్టీలు సైతం బీజేపీపై విరుచుకుపడ్డాయి.

Mamata on misuse of CBI 'మోదీకి తెలుసో.. లేదో..!'

తాజాగా.. ఇదే విషయంపై పశ్చిమ్​ బెంగాల్​ అసెంబ్లీలో ప్రసంగించారు మమతా బెనర్జీ. ఈ క్రమంలో.. సీబీఐ, ఈడీల దుర్వినియోగంలో మోదీ పాత్ర ఉండకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

"సీబీఐ, ఈడీ దుర్వినియోగంలో మోదీ పాత్ర ఉండకపోవచ్చు. బీజేపీలోని ఓ వర్గం దీనికి బాధ్యత వహిస్తోంది," అంటూ అమిత్​ షా ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖపై పరోక్ష ఆరోపణలు చేశారు మమతా బెనర్జీ. గతంలో సీబీఐ.. ప్రధాని కార్యాలయానికి రిపోర్టు చేసేదని.. కానీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ పరిధిలోకి వెళ్లిందని అన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

TMC vs BJP : 'సొంత పార్టీ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకోకుండా మోదీ చూసుకోవాలి. భారతీయ వ్యాపారవేత్తలు.. సీబీఐ ఒత్తిడి భరించలేక విదేశాలకు వెళ్లిపోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ప్రధాని దృష్టిసారించాలి,' అంటూ ప్రవేశపెట్టిన ఆ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. 189-69 ఓట్ల తేడాతో ఆ తీర్మానం గట్టెక్కింది.

2014 నుంచి బీజేపీపై మమతా బెనర్జీ పోరాటం చేస్తున్నారు. 2022 ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారాలతో పశ్చిమ్​ బెంగాల్​ దద్దరిల్లింది. ఆ యుద్ధంలో మమతా బెనర్జీ విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా.. విపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో మోదీకి సానుకూలంగా దీదీ తొలిసారి మాట్లాడటం సర్వత్రా చర్చకు దారితీసింది.

అదే కారణమా?

Mamata Banerjee vs Modi : మమతా బెనర్జీ చేసిన తీర్మానాన్ని బీజేపీ వ్యతిరేకించింది. సొంత పార్టీ సభ్యులను సీబీఐ, ఈడీ విచారణల నుంచి రక్షించుకోవడం కోసమే ఆమె ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించింది.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్​ కూడా స్పందించింది. 'దీదీ- మోదీ మధ్య ఒప్పందం కుదురినట్టు ఉంది. అందుకే ఆమె మోదీకి సానుకూలంగా మాట్లాడుతున్నారు. ఇందతా వ్యూహాత్మకమే,' అని విమర్శించింది.