New districts : ఆ రాష్ట్రానికి కొత్తగా 7 జిల్లాలు.. సీఎం ప్రకటన
New districts in West Bengal : కొత్తగా 7 జిల్లాలను ప్రవేశపెడుతున్నట్టు సీఎం ప్రకటించారు. ఫలితంగా పశ్చిమ్ బెంగాల్లో జిల్లాల సంఖ్య 30కి చేరనుంది.
New districts in West Bengal : రాష్ట్రంలో కొత్తగా 7 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఇదే జరిగితే.. పశ్చిమ్ బంగాల్లో మొత్తం జిల్లాల సంఖ్య 30కి చేరుతుంది.
ట్రెండింగ్ వార్తలు
7 జిల్లాల్లోని ఆరింటికి పేర్లు కూడా వచ్చేశాయి. అవి.. సుందర్బన్, ఇఛ్చిమతి, రణఘాట్, బిష్ణుపూర్, జాంగిపూర్, బెహ్రంపూర్. బాసిహ్ట్ నుంచి మరొక జిల్లాను తీసుకొస్తున్నారు.
"ఇప్పటివరకు 23 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని 30కి చేస్తున్నాము," అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.
అదే సమయంలో.. ఈ నెల 3న.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణను చేపట్టనున్నట్టు మమత తెలిపారు. కొత్తగా నలుగురు- ఐదుగురు కేబినెట్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
"చాలా శాఖలకు మంత్రులు లేరు. అవన్నీ నా భుజాలపై మోసుకోలేదు. మొత్తం కేబినెట్నే తొలగించాలన్న ఆలోచన లేదు," అని పశ్చిమ్ బెంగాల్ సీఎం స్పష్టం చేశారు.
టీఎంసీ నేత పార్థా ఛట్టర్జీ అరెస్ట్ నేపథ్యంలో కేబినెట్ మార్పుల వ్యవహారం సర్వత్రా చర్చకు దారితీసింది.
గ్రూప్ సీ, గ్రూప్ డీ సిబ్బంది, టీచర్లు, 11-12 తరగతులకు అసిస్టెంట్ టీచర్ల నియామకంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. టీచర్స్ జాబ్ స్కామ్పై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది కోల్కతా హైకోర్టు. ఈక్రమంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ఈ పూర్తి వ్యవహారంలో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించేందుకు ఈడీ దర్యాప్తు చేపట్టింది.
స్కామ్ జరిగిందని అంటున్న సమయంలో పార్థ ఛటర్జీ.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయనకు అత్యంత సన్నిహితురాలిగా పేరొందిన అర్పితా ముఖర్జీని సైతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె ఆస్తుల్లో నుంచి ఇప్పటికే రూ. 50కోట్ల నగదు, రూ. లక్షలు విలువ చేసే ఆభరణాలు బయటపడ్డాయి.
సంబంధిత కథనం