తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

HT Telugu Desk HT Telugu

04 May 2024, 21:19 IST

  • Chardham Yatra 2024: పవిత్ర చార్ ధామ్ యాత్రకు సంబంధించిన కీలక అప్ డేట్ వెలువడింది. చార్ ధామ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు మే 8 వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్షయ తృతియ సందర్భంగా మే 10 నుంచి 2024 సంవత్సర చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది.

 యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్
యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ (File photo)

యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్

Chardham Yatra 2024: హిమాలయ పర్వత సానువుల్లో కొలువైన నాలుగు పవిత్ర దేవాలయాల సందర్శనకు ఉద్దేశించిన చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం మే 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రకు మే 8వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. 2024 మే 8 నుండి హరిద్వార్, రిషికేష్లలో ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు హరిద్వార్ లోని రాహి మోటెల్, రిషికేశ్ లోని యాత్ర రిజిస్ట్రేషన్ కార్యాలయం అండ్ ట్రాన్సిట్ క్యాంప్ లో జరుగుతాయి.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

గరిష్ట పరిమితి ఉంటుంది..

ప్రతి ధామ్ కు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ కు రోజువారీ గరిష్ట పరిమితిని రిషికేశ్ లో 1000, హరిద్వార్ లో 500 గా నిర్ణయించారు. అక్షయ తృతియ సందర్భంగా మే 10 నుంచి చార్ ధామ్ యాత్ర 2024 (Chardham Yatra 2024) ప్రారంభం కానుంది. చార్ ధామ్ యాత్ర నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు, యాత్రికులు యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

సమన్వయంతో ఏర్పాట్లు..

చార్ ధామ్ యాత్ర 2024 ను విజయవంతం చేయడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. ఉత్తరాఖండ్ చార్ధామ్ తీర్థ్ పురోహిత్ మహాపంచాయత్ ఉత్తరాఖండ్ పర్యాటక శాఖతో సమన్వయం చేయడానికి ప్రతి ధామ్ నుండి ఇద్దరు తీర్థ్ పురోహితులను నామినేట్ చేసింది. చార్ ధామ్ యాత్ర ప్రతి సంవత్సరం జరుగుతుంది. హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన పర్యటన."చార్ ధామ్" అనే పదం రెండు హిందీ పదాల నుండి ఏర్పడింది. 'చార్' అంటే నాలుగు, మరియు 'ధామ్' అంటే మతపరమైన ప్రదేశాలు. కాబట్టి చార్ ధామ్ యాత్ర అనే పేరుకు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు హిందూ పుణ్యక్షేత్రాలకు మతపరమైన తీర్థయాత్ర అని అర్థం.

చార్ధామ్ యాత్ర 2024 కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్

చార్ ధామ్ యాత్ర కోసం ఆన్ లైన్ లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ దశలను అనుసరించడం ద్వారా చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

  • ముందుగా చార్ ధామ్ యాత్ర అధికారిక వెబ్ సైట్ registrationandtouristcare.uk.gov.in ఓపెన్ చేయాలి.
  • ఆ పై 'రిజిస్టర్' లేదా 'లాగిన్' అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ ఫారంలో, పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
  • ప్రయాణ తేదీలు, టూర్ పేరు, టూర్ రకం, పర్యాటకుల సంఖ్య వంటి వివరాలను నింపాలి.
  • ఫామ్ ను సబ్మిట్ చేసిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది.
  • చార్ ధామ్ యాత్ర 2024 రిజిస్ట్రేషన్ లెటర్ యొక్క కాపీని డౌన్లోడ్ చేయడానికి లేదా ప్రింట్ చేయడానికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ ను ఉపయోగించండి.

తదుపరి వ్యాసం