తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hyderabad Bus Accident : మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం- 14మంది మృతి

Hyderabad bus accident : మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం- 14మంది మృతి

Sharath Chitturi HT Telugu

22 October 2022, 9:10 IST

    • Hyderabad bus accident : మధ్యప్రదేశ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14మంది మరణించారు. మరో 40మంది గాయపడ్డారు.
హైదరాబాద్​ బస్సుకు ఘోర ప్రమాదం.. 14మంది మృతి!
హైదరాబాద్​ బస్సుకు ఘోర ప్రమాదం.. 14మంది మృతి!

హైదరాబాద్​ బస్సుకు ఘోర ప్రమాదం.. 14మంది మృతి!

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేవా జిల్లాలో ఓ బస్సు- ట్రక్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు, 40మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

ఏం జరిగింది?

ప్రమాదానికి గురైన బస్సు.. హైదరాబాద్​ నుంచి ఉత్తర్​ప్రదేశ్ ​గోరఖ్​పూర్​కు బయలుదేరింది. మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​కు 530కి.మీల దూరంలో ఓ ట్రక్​ను ఢీకొట్టింది. తొలుత ఆ ట్రక్​.. ఎదురుగా వెళుతున్న ట్రక్​ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. వెనకే వస్తున్న బస్సు కూడా ట్రక్​ను ఢీకొట్టిందని సమాచారం.

కాగా.. ఘటన జరిగిన సమయంలో బస్సులో 100మంది వరకు ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వీరందరు ఉత్తర్​ప్రదేశ్​వాసులేనని సమాచారం. దీపావళి కోసం వీరు హైదరాబాద్​ నుంచి ఉత్తర్​ప్రదేశ్​కు బయలుదేరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను చేపట్టారు. 20 మంది క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

బస్సు ప్రమాదం ఘటనపై రాజస్థాన్​ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను సానుభూతి ప్రకటించారు.