తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia Ukraine War : 75 మిసైళ్లతో ఉక్రెయిన్​పై దాడి.. యుద్ధం మరింత తీవ్రం!

Russia Ukraine war : 75 మిసైళ్లతో ఉక్రెయిన్​పై దాడి.. యుద్ధం మరింత తీవ్రం!

Sharath Chitturi HT Telugu

10 October 2022, 14:51 IST

    • Russia Ukraine war latest news : రష్యా ఉక్రెయిన్​ యుద్ధం మరింత ముదిరింది. ఉక్రెయిన్​పై రష్యా సోమవారం మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ ఘటనల్లో అనేక మంది మరణించినట్టు తెలుస్తోంది.
రష్యా మిసైల్​ దాడితో కీవ్​ నగరంలో దెబ్బ తిన్న ఓ భవనం
రష్యా మిసైల్​ దాడితో కీవ్​ నగరంలో దెబ్బ తిన్న ఓ భవనం (REUTERS)

రష్యా మిసైల్​ దాడితో కీవ్​ నగరంలో దెబ్బ తిన్న ఓ భవనం

Russia latest attacks on Ukraine : క్రిమియా వంతెనపై దాడి ఘటనకు రష్యా ప్రతీకారం తీర్చుకుంది! యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్​ దేశం.. మిసైల్​ దాడులతో అల్లాడిపోయింది. ఉక్రెయిన్​లోని అనేక ప్రాంతాల్లో రష్యా సోమవారం దాడులకు పాల్పడింది. తమపై 75మిసైళ్లతో రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్​ ఆరోపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

Sunita Williams space mission : చివరి నిమిషంలో.. సునీత విలియమ్స్ 3వ​ స్పేస్​ మిషన్​ రద్దు!

"ఉక్రెయిన్​పై మిసైల్​ దాడి జరుగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో క్షిపణులతో దాడులు చేస్తున్నారని సమాచారం ఉంది. ప్రజలు షెల్టర్లలోనే ఉండాలి. బయటకు రాకూడదు. సోమవారం ఉదయం నుంచి 75మిసైళ్లతో దాడి చేశారు," అని ప్రెసిడెంట్​ ఆఫీసులోని ఓ అధికారి మీడియాకు వెల్లడించారు.

Russia Missile attack on Kyiv : తాజా దాడిలో ఉక్రెయిన్​ రాజధాని కీవ్​ భారీగా దెబ్బతింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:15 గంటలకు కీవ్​పై దాడులు మొదలయ్యాయి. పేలుళ్లు జరిగిన ప్రాంతాలకు అంబులెన్స్​లు దూసుకెళ్లాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. సోమవారం ఉదయం నుంచి కీవ్​లో ఐదుకుపైగా దాడులు జరిగినట్టు సమాచారం.

<p>కీవ్​పై దాడిలో ధ్వంసమైన వాహనం</p>

జూన్​ 26 తర్వాత..

క్రిమియాను రష్యాను అనుసంధానం చేసే ఓ వంతెనపై రెండు రోజుల క్రితం పేలుడు జరిగింది. ఆ ఘటనలో వంతెన పాక్షికంగా దెబ్బతింది. వాస్తవానికి ఈ వంతెన రష్యాకు ఎంతో అవసరం. కీలకమైన సైనిక రవాణాలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. వంతెనపై దాడి ఉక్రెయిన్​ పనేనా? అన్నది ఇంకా తెలియరాలేదు. కానీ ఉక్రెయిన్​పై పగ తీర్చుకుంటామని రష్యా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే.. సోమవారం మిసైళ్లతో విరుచుకుపడింది.

Russia Ukraine war : కీవ్​పై చివరిగా జూన్​ 26న దాడులు జరిపింది రష్యా. ఇప్పుడు మళ్లీ ఈ స్థాయిలో పేలుళ్లు జరుగుతుండటం.. సర్వత్రా భయాందోళనకు కారణమవుతోంది. యుద్ధం మరింత తీవ్రమవుతుందన్న భయం అందరిలో నెలకొంది.

<p>మిసైల్​ దాడి తర్వాత కీవ్​ నగరం ఇలా..</p>

మరికొన్ని గంటల్లో భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. ఈ తరుణంలో ఉక్రెయిన్​వ్యాప్తంగా దాడులు జరుగుతుండటం చర్చకు దారితీసింది.

ఉక్రెయిన్​లో తాజా దాడులను ఆ దేశాధ్యక్షుడు జెలెన్​స్కీ ఖండించారు. ఉక్రెయిన్​ను భూమి మీద లేకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

<p>మిసైల్​ దాడిలో గాయపడిన వ్యక్తి..</p>

"తాజా దాడుల్లో చాలా మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ప్రజలు షెల్టర్లలోనే ఉండాలి. మనల్ని భూమి మీద లేకుండా చేసేందుకు రష్యా కుట్రపన్నుతోంది," అని జెలెన్​స్కీ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.

లివ్​, టెర్నోపిల్​, జోటోమిర్​ ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఒక్క కీవ్​లోనే.. దాడుల కారణంగా 8మంది మరణించినట్టు, 24మంది గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.