తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Crime News: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

HT Telugu Desk HT Telugu

07 May 2024, 18:03 IST

  • US crime news: భర్తతో విబేధాలు,కొడుకు ఎవరి దగ్గర ఉండాలనే విషయంలో కోర్టు కేసు.. ఈ పరిస్థితుల్లో కన్న కొడుకునే షూట్ చేసి చంపేసింది ఒక తల్లి. తన కొడుకు కస్టడీ తండ్రికి దక్కకూడదనే అక్కసుతో ఈ దారుణానికి ఒడి గట్టింది. అంతేకాదు, ఆ తరువాత తను కూడా అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pexels)

ప్రతీకాత్మక చిత్రం

US crime news: రేపు టెక్సస్ కోర్టులో మూడేళ్ల కొడుకు కైడెన్ కస్టడీకి సంబంధించి ఫైనల్ హియరింగ్ ఉంది. ఈ రోజు ఉదయమే లేచిన 32 ఏళ్ల సవన్నా క్రిగర్ గబగబా రెడీ అయి, కొడుకు కైడెన్ ను నిద్ర లేపి రెడీ చేసింది. ఆ తరువాత, కొడుకు కైడెన్ ను డే కేర్ సెంటర్ లో దింపేసి, తాను ఆఫీస్ కు బయల్దేరింది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

జాబ్ కు రిజైన్ చేసి..

ఆఫీస్ కు చేరుకున్న సవన్నా అక్కడ హెచ్ ఆర్ ను కలిసి, తన రిజిగ్నేషన్ లెటర్ ను ఇచ్చేసింది. తన క్యాబిన్ లోకి వెళ్లి, ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఇతర వస్తువులు తీసుకుని ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. అక్కడి నుంచి నేరుగా తన మాజీ భర్త, గతంలో తాము కలిసి ఉన్న ఇంటికి వెళ్లింది. అప్పటికే, ఫ్లాట్ కు తాళం వేసి ఆమె భర్త ఆఫీస్ కు వెళ్లిపోయాడు. తన వద్ద ఉన్న మారు తాళం చెవితో ఇంట్లోకి వెళ్లిన సవన్నా.. అక్కడి వస్తువులను ధ్వంసం చేసింది. ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను చింపేసింది. ఫర్నిచర్ ను, ఇంట్లోని అప్లయన్సెస్ ను నాశనం చేసింది. కప్ బోర్డ్ ను చిందరవందర చేసి, అక్కడ లోపల ఉన్న తమ పెళ్లి నాటి వెడ్డింగ్ గౌన్ ను బయటకు తీసి బెడ్ పై వేసి తగలపెట్టింది.

డాడీకి గుడ్ బై చెప్పు..

ఆ తరువాత అక్కడి నుంచి డైరెక్ట్ గా తన కొడుకు ఉన్న డే కేర్ సెంటర్ కు వెళ్లి, కొడుకు కైడెన్ ను పికప్ చేసుకుంది. తనను తీసుకుని, తను ఉంటున్న ఇంటి సమీపంలోకి చిన్న పార్క్ లోకి వెళ్లింది. పార్క్ లో కాస్త నిర్మానుష్యంగా ఉన్న చిన్న గుంత లాంటి ప్రదేశంలోకి వెళ్లి, ఒక చిన్న చెట్టు కింద కూర్చుంది. ఆ తరువాత తన ఐ ఫోన్ తీసుకుని తన మాజీ భర్తకు ఫేస్ టైమ్ లో కాల్ చేసింది. ఫోన్ కెమెరాను తన కుమారుడి ఫేస్ ముందు ఉంచి.. ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ అన్నది. తండ్రి ముఖం చూడగానే తన తల్లి ఉద్దేశం అర్థ కాని ఆ చిన్నారి నవ్వుతూ తండ్రికి గుడ్ బై చెప్పింది. ఆ వెంటనే, సవన్నా తన బ్యాగ్ లో నుంచి పిస్టల్ ను తీసి, తన కొడుకుకు ముద్దు పెట్టి, సారీ చెబుతూ, గురిపెట్టి కాల్చేసింది. క్షణాల్లో ఆ చిన్నారి విగతజీవిగా మారిపోయాడు. ఆ వెంటనే, తన నుదిటిపై కాల్చుకుని ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది.

పోలీసులకు సమాచారం

కళ్ల ముందే, క్షణాల్లో జరిగిన ఈ దారుణాన్ని చూసి, నిశ్చేష్టుడైన ఆ తండ్రి.. కాసేపటికి తేరుకుని పోలీసులకు సమాచారమిచ్చాడు. దాంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు పార్క్ లోని ఒక మూల తల్లీ, కొడుకుల మృతదేహాలు కనిపించాయి. అమెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల సవన్నా క్రిగర్ తన కుమారుడు కైడెన్ విషయంలో తన మాజీ భర్తతో జరిగిన గొడవ కోసం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ హత్య-ఆత్మహత్యకు ముందు, క్రిగర్ తన మాజీ భర్తతో ఫేస్ టైమ్ లో ‘‘ఈ రోజు తరువాత నీకు ఏమీ ఉండదు’’ అని చెప్పింది. పోలీసులు రిట్రీవ్ చేసుకున్న ఆమె ఫోన్ లో 21 సెకన్ల నిడివి గల ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో క్రిగర్, ఆమె కుమారుడు పార్కులో కూర్చున్నారు. తన తండ్రికి వీడ్కోలు చెప్పాలని ఆ మహిళ కొడుకును కోరింది.

తదుపరి వ్యాసం