తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Modi Plays “Ransingha”: ‘రణ సింఘ’ను పూరించిన ప్రధాని మోదీ..

Modi plays “Ransingha”: ‘రణ సింఘ’ను పూరించిన ప్రధాని మోదీ..

HT Telugu Desk HT Telugu

05 October 2022, 21:20 IST

  • Modi plays “Ransingha”: ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ బుధవారం పర్యటించారు.

‘రణసింఘ’ను పూరిస్తున్న ప్రధాని మోదీ
‘రణసింఘ’ను పూరిస్తున్న ప్రధాని మోదీ (ANI)

‘రణసింఘ’ను పూరిస్తున్న ప్రధాని మోదీ

Modi plays “Ransingha”: ప్రధాని మోదీ బుధవారం హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. బిలాస్ పూర్ లో ఎయిమ్స్ ను, హైడ్రో ఇంజినీరింగ్ కాలేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిలాస్ పూర్ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఇచ్చిన ట్రంపెట్ తరహా సంప్రదాయ సంగీత వాద్య పరికరం ‘రణసింఘ’ను ప్రధాని మోదీ పూరించారు. తరువాత మాట్లాడుతూ, భవిష్యత్తులో సాధించబోయే విజయాలకు ఇదే నాంది అని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Modi plays “Ransingha”: వారివి శంకుస్థాపనలే…

బీజేపీ అధికారంలోకి రాకముందు అధికారంలో ఉన్న పార్టీలు కేవలం శంకుస్థాపనలు మాత్రమే చేశాయని, బీజేపీ శంకుస్థాపనలతో పాటు ఆయా అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలను కూడా చేస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2017లో తాను శంకుస్థాపన చేసిన ఎయిమ్స్, హైడ్రో ఇంజినీరింగ్ కాలేజీలనే ఈ రోజు మోదీ ప్రారంభించడం గమనార్హం. బిలాస్ పూర్ నుంచి దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రధాని మోదీ కులూ వెళ్లారు.