భారత్లో 26/11 తరహా ఉగ్రదాడికి కుట్ర.. రంగంలోకి ఆ ఆరుగురు!
20 August 2022, 10:19 IST
- Terror attack in India : పాకిస్థాన్ ఆధారిత ఫోన్ నెంబర్ నుంచి ముంబై పోలీసులకు ఓ మెసేజ్ వచ్చింది. 26/11 తరహాలో ఉగ్రదాడికి పాల్పడతామని ఆ మెసేజ్లో ఉంది.
భారత్లో 26/11 తరహా ఉగ్రదాడికి కుట్ర!
Terror attack in India : దేశంలో 26/11 తరహా ఉగ్రదాడులకు పాల్పడతామని వచ్చిన వాట్సాప్ మెసేజ్తో ముంబై పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు ఈ వార్త కలకలం సృష్టిస్తోంది.
ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్కు శనివారం ఉదయం ఈ మెసేజ్ వచ్చింది. 26/11 తరహా దాడులు చేస్తామని.. పాకిస్థాన్ ఆధారిత ఫోన్ నెంబర్ నుంచి.. ముంబై పోలీసులకు ఈ మెసేజ్ అందింది.
మెసేజ్ ప్రకారం.. ఆరుగురు ఉగ్రవాదులు.. దేశంలో ఉగ్రదాడికి పాల్పడతారు!
ఈ మెసేజ్ ఎవరు పంపారు? ఇందులో నిజమెంత? అన్న వివరాలు ఇంకా తెలియలేదు. అయితే.. పోలీసులు మాత్రం ఈ వాట్సాప్ మెసేజ్ను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
'టెర్ర్ బోట్..'
26/11 attacks : ఉగ్రదాడులపై బెదిరింపులు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. అయితే.. ఆధునిక ఆయుధాలతో కూడిని ఓ బోటును మహారాష్ట్ర పోలీసులు కొన్ని రోజుల క్రితమే పట్టుకున్న నేపథ్యంలో.. తాజా ఘటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
మహారాష్ట్రలోని హరిహరేశ్వర్ తీరానికి ఒక బోటు వచ్చింది. అందులో నిండుగా ఆయుధాలు ఉన్నాయి. ఏకే 47 తుపాకులు, బుల్లెట్లు, ఇతర పేలుడు పదార్ధాలతో ఆ బోటు నిండి ఉంది. ఆ బోటును పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.
ఆయుధాలతో కూడిన ఆ బోటును భారత్లో ముఖ్యంగా మహారాష్ట్రలో ఉగ్ర దాడులు చేసే ఉద్దేశంతోనే పంపించి ఉంటారని భావిస్తున్నారు. ఆ బోటుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు. అందులో ఎవరైనా ఉన్నారా? లేక కేవలం ఆయుధాలతో ఆ బోటు వచ్చిందా? అనే విషయంలోనూ స్పష్టత లేదు. అయితే, అది స్పీడ్ బోటు అని తెలుస్తోంది. మహారాష్ట్రలోని రాయిగఢ్ జిల్లాలోని హరిహరేశ్వర్ తీరానికి ఆ పడవ వచ్చింది. ఆ ప్రదేశం ముంబైకి 200 కిమీ దూరంలో, పుణెకు 170కిమీల దూరంలో ఉంది. ఈ ఘటనతో రాయిగఢ్ వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
26/11 దాడులు..
2008లో జరిగిన ఉగ్రదాడులను దేశం ఇంకా మర్చిపోలేదు. పలువురు ఉగ్రవాదులు.. సముద్ర మార్గంలో ముంబైలోకి చొరబడి.. అలజడులు సృష్టించారు. ఆయుధాలతో ముంబై వీధుల్లో విచ్చలవిడిగా సంచరించి.. ప్రజల ప్రాణాలు తీశారు. తాజ్ హోటల్లోకి చొరబడి.. హింసాకాండకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో అనేక మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు.