తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Measles Epidemic: ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న మీజిల్స్ కేసులు

Measles epidemic: ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న మీజిల్స్ కేసులు

HT Telugu Desk HT Telugu

22 December 2022, 22:46 IST

  • Measles epidemic: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీజిల్స్(తట్టు, అమ్మవారు) కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, బుధవారం 9 కొత్త కేసులను గుర్తించారు. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (File)

ప్రతీకాత్మక చిత్రం

Measles epidemic: ముంబైలో మీజిల్స్(measles) కేసులు పెరుగుతున్నాయి. ఈ మీజిల్స్ measles) నే తట్టు, అమ్మవారు అంటారు. ఇది వైరస్ ద్వారా సోకుతుంది. పెద్ద ఎత్తున టీకాలను వేస్తున్నప్పటికీ.. ఈ వ్యాధికి సంబంధించిన కేసుల సంఖ్య పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. పిల్లలో తీవ్రమైన జ్వరం, దగ్గు, చర్మంపై ఎరుపురంగులో దద్దుర్లు, ముక్కు నుంచి, కళ్ల నుంచి నీరు కారడం.. మొదలైనవి ఈ మీజిల్స్ లక్షణాలు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Measles epidemic: 500 దాటిన కేసులు

తాజాగా నమోదైన 9 కేసులతో కలిపి, ఇప్పటివరకు ముంబైలో మొత్తం 505 మీజిల్స్(measles) కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ వ్యాధితో ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదని బీఎంసీ (Birhanmumbai Municipal Corportation BMC) వర్గాలు తెలిపాయి. బుధవారం మీజిల్స్(measles) సంబంధిత లక్షణాలతో 36 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరారని వెల్లడించాయి. వారిలో9 మందికి ఈ వ్యాధినిర్ధారణ అయిందని తెలిపాయి. బీఎంసీ ఇప్పటికే మీజిల్స్(measles) ను ముంబైలో ఎపిడమిక్ (epidemic) గా ప్రకటించింది.

Measles epidemic: యుద్ధ ప్రాతిదికన టీకాలు..

మీజిల్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన మీజిల్స్ రుబెల్లా టీకాను(measles-rubella vaccine) వేస్తున్నారు. ఇప్పటివరకు 9 నెలల నుంచి 6 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న 65 వేల మంది పిల్లలకు ఈ టీకా వేశామని బీఎంసీ వెల్లడించింది. ఈ తట్టు వ్యాధి సోకే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి టీకాలు వేస్తున్నామని తెలిపింది. ప్రతీ ఇంటికి వెళ్లి పరీక్షలు జరుపుతున్నామని తెలిపింది.

టాపిక్