తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hanuman Chalisa Row | 'ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతాము..'

Hanuman Chalisa row | 'ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతాము..'

HT Telugu Desk HT Telugu

25 April 2022, 17:51 IST

  • మహారాష్ట్ర: ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతామని, నమాజ్​ చేస్తామని అందుకు అనుమతులు కావాలని కేంద్రమంత్రి అమిత్​ షాకు లేఖ రాశారు ఓ ఎన్​సీపీ నేత. ఫలితంగా రాష్ట్రంలో హనుమాన్​ చాలీసా వివాదం మరింత ముదిరింది.

'ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతాము'
'ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతాము' (HT_PRINT/file)

'ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతాము'

Hanuman Chalisa row | మహారాష్ట్రలో హనుమాన్​ చాలీసా వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే.. ఎంపీ నవ్​నీత్​ కౌర్​ దంపతులు.. జైలుకెళ్లారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఎన్​సీపీకి చెందిన ఓ ముస్లిం నేత స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు.. హనుమాన్​ చాలీసా చదవడంతో పాటు నమాజ్​ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం అనుమతులు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు లేఖ రాశారు.

ట్రెండింగ్ వార్తలు

Kejriwal gets interim bail: కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు; ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారానికి వీలు

Man chops off girl's head: పెళ్లి క్యాన్సిల్ అయిందని మైనర్ తల నరికి, తీసుకువెళ్లిన యువకుడు

స్టూడెంట్​తో సెక్స్​ చేసిన టీచర్​ అరెస్ట్​.. బెయిల్​పై బయటకు వచ్చి మరో విద్యార్థి వల్ల గర్భం!

Protein supplements ICMR : ప్రోటీన్​ సప్లిమెంట్స్​ వాడొద్దని ఐసీఎంఆర్​ ఎందుకు చెప్పింది?​

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదువుతామని ఎంపీ నవ్​నీత్​ రాణా​- ఎమ్మెల్యే రవి రాణాలు హెచ్చరించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య వారిని పోలీసులు అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు. వారికి ఇంకా బెయిల్​ కూడా మంజూరు కాలేదు. కాగా.. ఈ ఘటనలకు ప్రతీకారంగా.. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసం లోక్​ కల్యాణ్​ మార్గ్​ ముందు హనుమాన్​ చాలీసా చదువుతామని, అనుమతులు ఇవ్వాలని ఎన్​సీపీ నేత ఫమిద హసన్​ ఖాన్​ అమిత్​ షాకు లేఖ రాసినట్టు తెలుస్తోంది.

PM Modi | ముస్లిం అయినప్పటికీ.. తాను తన ఇంట్లో నిత్యం హనుమాన్​ చాలీసా, దుర్గా చాలీసా చదువుతానని హసన్​ వెల్లడించారు.

"దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిద్రలేపాల్సిన సమయం వచ్చింది. మతోశ్రీ(ఉద్ధవ్​ ఠాక్రే నివాసం) వద్ద హనుమాన్​ చాలీసా చదువుతామని నవ్​నీత్​, రవిలు అంటున్నారు. అలాంటప్పుడు.. ప్రధాని ఇంటి ముందు హనుమాన్​ చాలీసా చదవడానికి, నమాజ్​ చేయడానికి మాకు కూడా అనుమతులు ఇవ్వాలి," అని హసన్​ ఖాన్​ పేర్కొన్నారు.

'ఉద్ధవ్​ ఠాక్రేను నిద్రలేపి హిందుత్వాన్ని బోధిస్తామని ఆ దంపతులు అంటున్నారు. అలాంటప్పుడు.. మోదీ, అమిత్​ షాలను కూడా నిద్రలేపాలి. అసలు సమస్యల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. జీడీపీ వృద్ధి పడిపోతోంది. ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్ర ప్రభుత్వం.. ఇలాంటి విషయాల(హనుమాన్​ చాలీసా వివాదం)ను తీసుకొస్తోంది.

టాపిక్