తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mangalore Auto Blast : ‘ఆటో పేలిన ఘటనతో ఉగ్రవాదానికి లింక్​!’

Mangalore auto blast : ‘ఆటో పేలిన ఘటనతో ఉగ్రవాదానికి లింక్​!’

20 November 2022, 13:57 IST

  • Mangalore auto blast : మంగళూరు ఆటో పేలుడు ఘటనతో ఉగ్రవాదానికి లింక్​ ఉన్నట్టు అనుమానిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని వివరించారు.

ఘటనాస్థలంలో స్వాధీనం చేసుకున్న కుక్కర్​
ఘటనాస్థలంలో స్వాధీనం చేసుకున్న కుక్కర్​ (PTI)

ఘటనాస్థలంలో స్వాధీనం చేసుకున్న కుక్కర్​

Mangalore auto blast : కర్ణాటక మంగళూరులో శనివారం జరిగిన ఆటో పేలుడు ఘటన.. సాధారణ విషయం కాదని పోలీసులు వెల్లడించారు. అది.. విధ్వంసం సృష్టించేందుకు జరిగిన ఉగ్రవాద ఘటన అని పేర్కొన్నారు. ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

ఉగ్రవాదంలో లింక్​లు..!

శనివారం.. మంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఓ ఆటో పేలింది. ఆ సమయంలో ఆటోలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ఈ వ్యవహారం రాష్ట్రంలో కలకలం సృష్టించింది.

Mangalore auto blast latest updates : మంగళూరు ఆటో పేలుడు ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి కర్ణాటక పోలీసులు పని చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి అరాగ జ్ఞానేంద్ర వెల్లడించారు.

"ఘటనలో గాయపడిన వ్యక్తులు.. మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈ ఘటనతో ఉగ్రవాదానికి లింక్​ ఉన్నట్టు కనిపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చాము. మంగళూరుకు ఓ బృందం వచ్చింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ విషయంపై మరింత సమాచారం లభిస్తుంది," అని హోంమంత్రి స్పష్టం చేశారు.

ఈ విషయంపై మరిన్ని వివరాలను.. కర్ణాటక డీజీపీ ప్రవీణ్​ సూద్​ మీడియాకు వివరించారు.

Karnataka auto blast incident : "ఘటనాస్థలం నుంచి ఓ కుక్కర్​ను స్వాధీనం చేసుకున్నాము. దానికి బ్యాటరీలు అతికించి ఉన్నాయి. ఇక పేలుడు జరిగిన సమయంలో డ్రైవర్​తో పాటు ఓ ప్యాసింజర్​ ఆటోలో ఉన్నాడు. ప్యాసింజర్​ వద్ద ఆధార్​ కార్డు ఉంది. అతను హుబ్బలిలో ఉంటాడు. అయితే.. ఆధార్​ కార్డులో ఉన్న ఫొటో అతనిది కాదు. దీని బట్టి.. అతను ఏదో ప్రణాళిక రచించాడని అర్థమైంది. ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాడో ఇంకా తెలియదు. ఇటీవలే జరిగిన కోయంబత్తూర్​ పేలుడు ఘటనకు, ఇతనికి సంబంధం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేము. అతను కర్ణాటకకు చెందిన వాడే. కానీ గత కొన్ని నెలలుగా ఇతర రాష్ట్రాలకు వెళుతూ వచ్చాడు. కోయంబత్తూర్​తో పాటు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తిరిగాడు," అని సూద్​ వివరించారు.

Karnataka crime news : మంగళూరు ఆటో పేలుడు ఘటనపై ప్రజలు మౌనంగా ఉండాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాపించకూడదని పోలీసులు పిలుపునిచ్చారు. తాజా పరిణామాలతో ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నట్టు.. త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.