తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  కడుపు నొప్పితో వచ్చిన రోగిని కర్రతో చితక్కొటిన డాక్టర్, వీడియో వైరల్!

కడుపు నొప్పితో వచ్చిన రోగిని కర్రతో చితక్కొటిన డాక్టర్, వీడియో వైరల్!

HT Telugu Desk HT Telugu

16 March 2022, 15:32 IST

    • కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని డాక్టర్ సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డరర్ తో సమానం.. అని అర్జున్ రెడ్డి సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అలాగే ప్రవర్తించాడు ఓ డాక్టర్
Doctor brutally thrash patient in Odisha
Doctor brutally thrash patient in Odisha (twitter)

Doctor brutally thrash patient in Odisha

Bhuvaneshwar | కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని డాక్టర్ సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డరర్ తో సమానం.. అని అర్జున్ రెడ్డి సినిమాలో ఒక డైలాగ్ ఉంది. రియల్ లైఫ్ లో కూడా కొంతమంది డాక్టర్లు అర్జున్ రెడ్డి తరహాలోనే ప్రవర్తిస్తున్నారనేదానికి ఈ ఘటనే నిదర్శనం. కడుపు నొప్పి బాబో అంటూ వచ్చిన ఓ రోగిని కర్రతో చితకబాది లేని నొప్పిని కలిగించాడు ఒక ప్రభుత్వ వైద్యుడు.

వివరాల్లోకి వెళ్తే, ఒడిషా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో రెండు రోజుల క్రితం ముఖేష్ నాయక్ అనే వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో స్థానిక ధర్మఘర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే అక్కడ డాక్టర్లు ఎవరూ లేరు, దీంతో అక్కడ ఉన్న ఇతర సిబ్బందిని విచారించంగా వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. అయితే నర్సులు వచ్చి అతడిని బెడ్ మీద పడుకోబెట్టి ఇంజక్షన్ చేశారు. అయినా కడుపునొప్పి ఏమాత్రం తగ్గలేదు. దీంతో డాక్టర్లు ఎందుకు లేరని ముఖేష్ మరోసారి అడిగాడు.

కొద్దిసేపటికి నేరుగా ముఖేష్ దగ్గరకు వచ్చిన డాక్టర్ సైలేష్ కుమార్ ఒక కర్ర అందుకొని అతడిపై దాడికి దిగాడు. పేషెంట్ అనే కనికరం కూడా చూపకుండా పిడిగుద్దులు కురిపించాడు. దీనికి సంబంధించి వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే డాక్టర్ సైలేష్ కుమార్ ఒక డాక్టర్ లాగా కాకుండా టీషర్ట్, బాక్సర్ ధరించి ఆసుపత్రికి రావడం ఇక్కడ గమనార్హం.

కాగా, ఈ ఘటనను చూసి చలించిన కొందరు స్థానికులు రోడ్డుపై బైఠాయించి దాడి చేసిన డాక్టరుకు నిరసనగా ధర్నాకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Video Here: