తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Mayor Election : బీజేపీ- అప్​ 'కొట్లాట'.. ఢిల్లీ మేయర్​ ఎన్నిక వాయిదా!

Delhi mayor election : బీజేపీ- అప్​ 'కొట్లాట'.. ఢిల్లీ మేయర్​ ఎన్నిక వాయిదా!

06 January 2023, 14:10 IST

  • Delhi mayor election : శుక్రవారం జరగాల్సిన ఢిల్లీ మేయర్​ ఎన్నిక వాయిదా పడింది. కొత్తగా ఎంపికైన కౌన్సిలర్ల మధ్య గొడవ జరగడం ఇందుకు కారణం.

సివిక్​ సెంటర్​లో గందరగోళం
సివిక్​ సెంటర్​లో గందరగోళం

సివిక్​ సెంటర్​లో గందరగోళం

Delhi Mayor elections 2023 :​ ఢిల్లీ మేయర్​ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఆమ్​ ఆద్మీ- బీజేపీ పార్టీకి చెందిన కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్​లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు! ఫలితంగా ఢిల్లీ మేయర్​ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

ఇదీ జరిగింది..

డిసెంబర్​లో జరిగిన ఢిల్లీ మున్సిపల్​ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ చారిత్రక విజయం సాధించింది. దశాబ్ద కాలంలో తొలిసారిగా ఇక్కడ బీజేపీ ఓడిపోయింది!

ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకు.. నామినేటెడ్​ సభ్యుల జాబితాను ప్రకటించారు ఢిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ సక్సేనా. ఆయన చర్యలను ఆప్​ తీవ్రంగా వ్యతిరేకించింది. ఢిల్లీ ప్రభుత్వంతో సంప్రదించకుండానే.. నామినేటెడ్​ సభ్యులను ఎలా ప్రకటిస్తారని మండిపడింది. లెఫ్టినెంట్​ గవర్నర్​ ఎంపిక చేసిన మొత్తం 10మందికి బీజేపీతో సంబంధం ఉందని ఆరోపించింది.

Delhi Mayor election live updates : మరోవైపు.. తాత్కాలిక స్పీకర్​గా బీజేపీకి చెందిన సత్య శర్మను ఎంపిక చేశారు లెఫ్టినెంటర్​ గవర్నర్​. ఆప్​ సూచించిన అత్యంత సీనియర్​ ముకేశ్​ గోయల్​ను పక్కనపెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. బీజేపీకి మేయర్​ పదవిని అక్రమంగా కట్టబెట్టేందుకు లెఫ్టినెంట్​ గవర్నర్​ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించింది ఆప్​.

కాగా.. ఢిల్లీ మేయర్​ను ఎన్నుకునేందుకు.. సివిక్​ సెంటర్​లో కొత్తగా ఎంపికైన కౌన్సిలర్​లు శుక్రవారం సమావేశమయ్యారు. ఆప్​ అభ్యర్థి షెల్లి ఒబేరాయ్​, బీజేపీ అభ్యర్థి రేఖ గుప్తల్లో ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే.. తాత్కాలిక స్పీకర్​గా ప్రమాణం చేసిన సత్య శర్మ.. నామినేటెడ్​ సభ్యులను ప్రమాణస్వీకారం కోసం పిలిపించారు. ఇక్కడే సభలో గందరగోళం నెలకొంది. నామినేటెడ్​ సభ్యులను ఆప్​ కౌన్సిలర్​లు అడ్డుకున్నారు. ముందుగా.. ఎన్నికైన కౌన్సిలర్​లతో ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్​ చేశారు. అదే ఆనవాయతీ అని గుర్తుచేశారు. ఈ క్రమంలో బీజేపీ- ఆప్​ మధ్య ఘర్షణపూరిత వాతావరణ నెలకొంది.

BJP vs AAP Delhi Mayor election : ప్రధాని మోదీ- ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​కు వ్యతిరేకంగా ఇరు వర్గాలు భారీ ఎత్తున నినాదాలు చేసుకున్నారు. ఓ సందర్భాల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొందరు నేల మీద పడిపోయరు. ఈ నేపథ్యంలో మేయర్​ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. సభ వాయిదా పడింది.

ఎంసీడీ సభలో 250 మంది ఎలక్టెడ్​ కౌన్సిలర్లు ఉంటారు. ఢిల్లీ తరఫున ఎన్నికైన ఏడుగురు లోక్​సభ ఎంపీలు, ఆప్​ తరఫున రాజ్యసభలో ఉన్న ముగ్గురు ఎంపీలు, ఢిల్లీ స్పీకర్​ నామినేట్​ చేసే 14మంది ఎమ్మెల్యేలు.. ఈ మేయర్​ ఎన్నికలో పాల్గొంటారు.

Delhi Mayor election : 250 వార్డుల్లో 134 చోట గెలుపొందింది ఆప్​. బీజేపీకి 104 సీట్లు దక్కాయి. కాంగ్రెస్​ నుంచి 9మందే గెలిచారు. ఫలితంగా మేయర్​ పదవికి పోటీ చేయకూడదని కాంగ్రెస్​ నిర్ణయించుకుంది. బీజేపీ కూడా.. పోటీ చేయకూడదని పక్కకు తప్పుకుని.. చివరి నిమిషంలో బరిలో దిగింది.