తెలుగు న్యూస్  /  Entertainment  /  Rangamarthanda Ott Platform Locked As The Prime Video Gets The Digital Rights Of The Movie

Rangamarthanda OTT Platform: రంగమార్తాండ వచ్చేది ఈ ఓటీటీలోనే.. భారీ మొత్తానికి డిజిటల్ హక్కులు

Hari Prasad S HT Telugu

16 March 2023, 15:10 IST

    • Rangamarthanda OTT Platform: రంగమార్తాండ ఏ ఓటీటీలో రానుందో తేలిపోయింది. వచ్చే వారం థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
రంగమార్తాండ మూవీ
రంగమార్తాండ మూవీ

రంగమార్తాండ మూవీ

Rangamarthanda OTT Platform: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో వస్తున్న మూవీ రంగమార్తాండ. ఈ ఎమోషనల్ డ్రామాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ వచ్చే బుధవారం (మార్చి 22) థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంలాంటి సీనియర్ నటులు నటిస్తున్న ఈ సినిమా తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ను కూడా లాక్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Lineman OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కామెడీ మూవీ.. అక్కడ స్ట్రీమింగ్.. కానీ, చిన్న ట్విస్ట్

Brahmamudi: అనామిక పేరెంట్స్‌ను బెదిరించిన కావ్య- న్యాయం చేయమంటూ నట్టింట్లో కూర్చున్న కనకం- ముకుందతోనే మురారికి బిడ్డ

Jathi Ratnalu 2: జాతి రత్నాలు 2 అప్పుడే! అప్డేట్ ఇచ్చిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్

Premikudu Re Release: ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమికుడు రీ రిలీజ్.. 30 ఏళ్లకు మళ్లీ.. 300కుపైగా థియేటర్లలో!

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ రంగమార్తాండ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించికున్నట్లు తెలుస్తోంది. హౌజ్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. ఈ మధ్యే అతడు స్వరపరచిన ఓ మంచి మెలోడీ సాంగ్ కూడా రిలీజైంది. "పువ్వై విరిసే ప్రాణం.. పండే మురిసే ప్రాయం.. రెండూ ఒకటే నాణానికి బొమ్మ బొరుసంతే" అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. రంగమార్తండ ఆత్మగీతంగా అభివర్ణించిన కృష్ణవంశీ ఈ పాటను తన ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా హృద్యంగా ఆలపించారు.

దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ కలం నుంచి రాలువాలిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఆయన తరహా సందేశాన్ని సాంగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. 3 నిమిషాల 14 సెకన్ల నిడివి కలిగిన ఈ సాంగ్ లిరిక్స్ అందరినీ మెప్పిస్తోంది. బహుశా సిరివెన్నెల రాసిన చివరి పాట ఇదే కావచ్చు.

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ మెగాఫోన్ పట్టి చాలా రోజులే అయింది. చివరగా ఆయన నక్షత్రం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా వచ్చి ఆరేళ్లు కావస్తోంది. నిజానికి రంగమార్తండ కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. మరి చాలా కాలం తర్వాత వస్తున్న కృష్ణవంశీ తన మునుపటి మ్యాజిక్ చేస్తాడా లేదా చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.