తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ssmb28 Ott Rights: భారీ ధరకు మహేష్-త్రివిక్రమ్ మూవీ ఓటీటీ హక్కులు.. సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థ

SSMB28 OTT Rights: భారీ ధరకు మహేష్-త్రివిక్రమ్ మూవీ ఓటీటీ హక్కులు.. సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థ

31 January 2023, 14:01 IST

    • SSMB28 OTT Rights: మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కించిన ఈ సినిమా రికార్డు ఓటీటీ ధరను సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను భారీ ధరను వెచ్చించి దక్కించుకుంది.
మహేష్-త్రివిక్రమ్ మూవీ
మహేష్-త్రివిక్రమ్ మూవీ

మహేష్-త్రివిక్రమ్ మూవీ

SSMB28 OTT Rights: సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందొతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీగా బజ్ ఏర్పడింది. ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ ప్రేమికుల్లో ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్‌లో ఎక్కువ మంది ఆత్రుతగా చూస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా ఆసక్తికరంగా మారింది. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నాన్ థియెట్రికల్ హక్కులను హాట్ కేకు వలే అమ్ముడుపోయినట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

Laapataa Ladies Review: ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సెటైరికల్ కామెడీ మూవీ ఆకట్టుకునేలా ఉందా? లాపతా లేడీస్ రివ్యూ

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మహేష్-త్రివిక్రమ్ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్ విడుదల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం వెచ్చించినట్లు సమాచారం. దాదాపు రూ.80 కోట్లకు ఈ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారీ ధరకు SSMB28 మూవీ అమ్ముడుపోయిందే నిజమైతే టాలీవుడ్ ఓటీటీ స్పేస్‌లో అత్యంథ ధర పలికిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా నిలుస్తుంది.

మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.